-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 5: కల్వకుర్తి ప్రాజెక్టును పనులు ఈనెలలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు ద్వారా 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్లోనే మహబూబ్నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు.
హైదరాబాద్/ నల్లగొండ, జూన్ 5: అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను, కార్యకర్తలను మరింత కృంగతీస్తోంది. టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంటే ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి మరింత వీక్, వేస్ట్ అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డికి పార్టీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసు పంపించింది.
హైదరాబాద్, జూన్ 5: రానున్న రెండేళ్ళలో హైదరాబాద్లో పైప్ లైన్ ద్వారా లక్ష గృహాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి ధరేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంచి నీరు, పారిశుధ్య మంత్రి రాంకృపాల్ యాదవ్ హైదరాబాద్కు వచ్చారు.
హైదరాబాద్, జూన్ 5: తెలంగాణవ్యాప్తంగా సోమవారం నుంచి కోర్టుల్లో విధులు బహిష్కరించాలని తెలంగాణ న్యాయవాదుల జెఏసి నిర్ణయించింది. ఆంధ్ర న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ వారంపాటు కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. 13న చలో హైకోర్టు నిర్వహిస్తారు. న్యాయవాదులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు.
నల్లగొండ, జూన్ 4: దక్షిణ తెలంగాణలో టిఆర్ఎస్ విస్తరణకు సవాల్గా మారిందని భావిస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగింది. గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శల దాడులకు దిగుతు రోడ్డున పడ్డారు. నేను ముందంటే నేను ముందు కారెక్కుతానంటు పోటీలు పడుతు కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారు.
జగిత్యాల టౌన్, జూన్ 4: ఓ పాత ఇనుప సామాను దుకాణంలో రాగి వైర్ దొంగలించారనే ఆరోపణతో ముగ్గురు బాలలను దుకాణం యజమాని స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చితికబాదాడు. ఈ సంఘటన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తబస్టాండ్ ప్రాంతంలో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో విబుది మారెమ్మ అనే మహిళ పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తుంది.
కరీంనగర్, జూన్ 4: గతకొంతకాలంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ముఠాను కరీంనగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లకు సహకరించిన భారతీయుడుతోసహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్కు చెందిన టెడ్డి మిలాన్, కెల్విన్తోపాటు ఉత్తరప్రదేశ్లోని బరేలికి చెందిన మహ్మద్ ఆసిమ్లను అరెస్ట్ చేశారు.
భిక్కనూరు, జూన్ 4: ‘ఎమ్మెల్యే అంటే తెలియని వాడివి... ఎందుకు పెట్టుకున్నావో వాడిని ...నా ముందుకు పిలిపించు.. వాడు ఎంతటివాడు... తక్షణమే వాడిని పనిలో నుండి తొలగించు’ అంటూ ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో టోల్ప్లాజా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బహుళ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, ఆమోదాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పర్యావరణవేత్త డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి శనివారం పిల్ను దాఖలు చేశారు. ఈ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో స్కూలు ఫీజులపై ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమం చేపట్టిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓలు తాజాగా ఒకే గొడుగు కిందకు వచ్చి న్యాయపోరాటానికి ఇంకో పక్క ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.