-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: గత రెండేళ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, చేతకాకుంటే ఆయన అధికారంలో నుంచి తప్పుకోవాలంటూ తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు.
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ విషయమై చర్చించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను విశే్లషిస్తూ తగిన నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్: సిఎల్పి నేతగా జానారెడ్డి పనికిరాడంటూ గతంలో కొన్ని వందలసార్లు విమర్శించిన పాల్వాయి గోవర్ధన్రెడ్డి, సర్వే సత్యనారాయణలకు పార్టీ హైకమాండ్ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి పనితీరును విమర్శించినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినవారికి పాల్వాయి, సర్వే చేసిన వ్యక్తిగత నిందలు గుర్తుకురాలేదా? అని ఆయన అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న దృష్ట్యా మద్యం తయారీ కంపెనీలకు నీటి సరఫరాను నిలిపివేయాలంటూ టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు జిహెచ్ఎంసి, జలమండలి అధికారులకు నోటీసులు జారీ చేసింది. మద్యం కంపెనీలకు నీటి సరఫరా గురించి మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: నీటివనరుల కేటాయింపుల్లో తెలంగాణకు సమైక్యపాలనలో తీరని అన్యాయం జరిగినందునే ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేస్తున్నామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. నదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం తాము పోరాడతామని, న్యాయబద్ధంగా రావాల్సిన నీటివాటాను సాధించి, కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టులపై ఎపి సర్కారు అభ్యంతరాలను ఎదుర్కొంటామన్నారు.
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనను తీవ్రతరం చేశారు. న్యాయాధికారుల నియామకాల్లో అక్రమాలను అరికట్టాలని, హైకోర్టును విభజించాలని, ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టు వద్ద సోమవారం ఉదయం లాయర్లు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లిపోయినందుకు తీవ్ర మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్ మండలం ముచ్చింతలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. మనోహర్ గౌడ్ అనే యువకుడు ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య పుట్టింటికి వెళ్లడం వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మహబూబ్నగర్: పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటానని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తగినంత నష్టపరిహారం చెల్లించాలని కొల్లాపూర్ తహశీల్దార్ ఆఫీసు వద్ద దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను ఆయన సోమవారం ఉదయం కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. రైతుల తరఫున తుది వరకూ పోరాడతానని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్: అపార్ట్మెంటుపై నుంచి కిందకు దూకి ఓ నడివయస్కుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ ఆదర్శనగర్లో సోమవారం ఉదయం జరిగింది. మృతుడిని చెంగిచర్లకు చెందిన వాసి ప్రభాకరరెడ్డి (45)గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా 1,100 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేస్తారు. వెయ్యి ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులతో పాటు వంద ఏసీ బస్సులను తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి కృష్ణానదీ తీరంలోని పుష్కర ఘాట్లకు నడుపుతారు.