S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/08/2016 - 12:17

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరులచే చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు ఎపి, తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా రోగులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీని నివారించేందుకు 32 కౌంటర్లను ఏర్పాటు చేసి ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. సుమారు 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

06/08/2016 - 08:31

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చేప మందు పంపిణీ సందర్భంగా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేప మందుకోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భద్రత కల్పించే విధంగా తగు చర్యలు తీసుకున్నామని, 1200 మంది సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

06/08/2016 - 08:28

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బుధవారం టిజెఎసి కీలక సమావేశం నిర్వహించి మంత్రుల వాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని టిజెఎసి కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

06/08/2016 - 08:19

హైదరాబాద్, జూన్ 7: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణలో నిర్వహిస్తున్న ఎంసెట్-2 దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 14వ తేదీ వరకూ గడువు పెంచారు. 500 రూపాయల జరిమానాతో జూన్ 20 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో 25వ తేదీ వరకూ, 5వేల జరిమానాతో 30వ తేదీ వరకూ, 10వేల జరిమానాతో జూలై 6వ తేదీ వరకూ పొడిగించారు.

06/08/2016 - 08:18

హైదరాబాద్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల లోటును భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలను, ఏడు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఏ మేరకు పెంచాలనే దానిపై ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.

06/08/2016 - 08:15

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ లారీలకు రవాణా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి సింగిల్ పర్మిట్లు అందేలా కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు మంత్రిని సచివాలయంలో కలుసుకొని సమస్యలు వివరించారు.

06/08/2016 - 06:51

భద్రాచలం, జూన్ 7: ఛత్తీస్‌గఢ్‌లో మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపారా సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న వైఎస్ సతీష్ సోమవారం అర్ధరాత్రి తలపై తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఆత్మహత్య చేసుకుంటున్న జవాన్ల సంఖ్య పెరుగుతోంది.

06/08/2016 - 06:20

మంచిర్యాల, జూన్ 7: ప్రజా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం ఉద్యమం సాగిస్తామని, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. మంగళవారం మంచిర్యాలలోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రెండేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రభుత్వ తీరు తెన్నులపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు.

06/08/2016 - 07:19

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో కొత్తగా 14నుంచి 15 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులకు స్పష్టత వచ్చింది. కొత్తగా 15 జిల్లాలుకాకుండా 14 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. కొత్త జిల్లాలతోపాటు 18 రెవిన్యూ డివిజన్లు, 40 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం.

06/07/2016 - 17:58

ఆదిలాబాద్: తమ సంస్థకు ప్రజలే గుర్తింపు ఇచ్చారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆయన మంచిర్యాలలో మంగళవారం ప్రజాసంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమ సంస్థకు ఏ నాయకుల గుర్తింపు అవసరం లేదని, తమకు ఎలాంటి పదవులు అక్కర్లేదని అన్నారు. తమకు ముందు, వెనుక ప్రజలే ఉన్నారన్నారు. తెరాస సర్కారు రెండేళ్ల పనితీరును ఆయన సమీక్షిస్తూ, జనం కోసం తాము పోరాటం వేడేది లేదని ప్రకటించారు.

Pages