S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/16/2015 - 06:58

తిరుమల, డిసెంబర్ 15 : టిటిడి చేపట్టిన వివిధ పథకాలకు విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించి ఏర్పాటుచేసిన డోనార్ సెల్ లో ఉచితంగా ఇచ్చే శ్రీవారి లడ్డూలను అక్కడ అటెండర్‌గా పని చేస్తున్న వెంకటరమణ అడ్డంగా దిగమింగాడు. మూడు నెలల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 20 వేల లడ్డూలను బ్లాకులో విక్రయించినట్లు టిటిడి విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేటతెల్లమయింది.

12/16/2015 - 06:57

హైదరాబాద్, డిసెంబర్ 15: మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని, మిగిలిన రాష్ట్రాలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ సంయుక్త కార్యదర్శి సత్యవ్రత సాహు తెలిపారు. తాగునీటి సరఫరాపై అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే మిషన్ భగీరథపై వివరించారు.

12/16/2015 - 06:56

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రభుత్వం నిర్మించే ఇళ్లు ప్రజలు నివాసయోగ్యంగానే కాకుండా, మరింత సౌకర్యవంతంగా ఉండాలని, పట్టణాల్లో నిర్మించే కాలనీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గృహనిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

12/16/2015 - 06:11

విజయవాడ, డిసెంబర్ 15: ప్రభుత్వ పాలనా సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు పాలనా ఫలితాలు అందించటంలో, వేగవంతమైన ప్రగతిని, వృద్ధిని సాధించటానికి ఏపి ప్రభుత్వం మలేసియా ప్రధానమంత్రి అజమాయిషీలో ఉండే ‘పెమాండు’ (పెర్ఫామెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్)తో ఒప్పందం కుదుర్చుకుంది.

12/16/2015 - 08:27

సూళ్లూరుపేట, డిసెంబర్ 15: పోలార్ శాటిలైట్ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి) ద్వారా ఒకేసారి ఆరు సింగపూర్ దేశానికి చెందిన విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురిపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్‌నుండి బుధవారం సాయంత్రం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగం జరగనుంది.

12/16/2015 - 08:24

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రలో విజయవాడ సహా పలు నగరాల్లో విస్తరించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై నిష్పాక్షికంగా న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కోరారు. మంగళవారం వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

12/16/2015 - 05:59

విజయవాడ, డిసెంబర్ 15:కాల్‌మనీ కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటినుంచీ ఈ కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపుతున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అకస్మాత్తుగా 15 రోజులు సెలవుపై వెడుతున్నారు. ఇందులో రాజకీయమేమీ లేదని డిజిపి స్వయంగా ప్రకటించినా, ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేకే సిపి సెలవుపై వెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

12/16/2015 - 05:53

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో దరఖాస్తు చేసిన వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు వారికి తాత్కాలిక రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

12/15/2015 - 16:42

హైదరాబాద్: నగర పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి డీసీపీలు, స్టేషన్ హెచ్‌ఎస్‌వోలతో మాట్లాడారు. నగరంలోని 60 పోలీస్ స్టేషన్లతోపాటు సబ్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్ తదితర 145 విభాగాలతో నేరుగా సంప్రదించే అవకాశం కలిగింది.

12/15/2015 - 16:41

హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్ ఎండీగా ఎస్పీ సింగ్ నియమితులైయ్యారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ సింగ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Pages