S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2015 - 06:43

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన వేతనాల అమలుకు జీవో జారీచేయాలంటూ ‘చలో విజయవాడ’ పేరిట రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన వేలాదిమంది అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు ఎర్ర జెండాలు చేతబట్టి కదంతొక్కారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రదర్శనగా బయల్దేరిన కార్యకర్తలను తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభంలోనే నిలుపుదల చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

12/19/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్ మనీ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో గందరగోళం, దుమారం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టగా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శించుకున్నారు.

12/19/2015 - 06:39

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుశాసనసభకు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లిఖితపూర్వకసమాధానం ఇచ్చారు.

12/19/2015 - 06:39

శ్రీకాళహస్తి/ఆత్మకూరు, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాల్ మనీ వ్యవహారం చిత్తూరు శ్రీకాళహస్తిలోనూ వెలుగుచూసింది. శ్రీ కాళహస్తి పట్టణంలో ఒక మహిళా వడ్డీ వ్యాపారి రుణం తీసుకొన్న వారిని వేధిస్తోందని ఫిర్యాదు రావడంతో పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

12/19/2015 - 06:31

హైదరాబాద్, డిసెంబర్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగా ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు వచ్చిన అభియాగాల్లో వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ హైక్టోరుకు తెలియజేసింది.

12/19/2015 - 06:22

విశాఖపట్నం, డిసెంబర్ 18: పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు తెలుగు తిరునాళ్లు పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి తెలిపారు.

12/19/2015 - 06:22

రాజమండ్రి, డిసెంబర్ 18: నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధానం ప్రాజెక్టులో త్వరలో ముందడుగు పడబోతోంది. దశాబ్దాలుగా సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించటంతోనే కాలం గడిచి పోతున్న నేపథ్యంలో త్వరలో డిటైల్డ్ ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను రూపొందించే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది.

12/19/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. శాసనసభలో కాల్‌మనీ రాకెట్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటన సారాంశం చదువుతుండగా, వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

12/19/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆంధ్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 58 మంది వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి అంబేద్కర్ జయంతిపై చర్చ ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

12/19/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శీతాకాల సమావేశం రెండోరోజైన శుక్రవారం పలు అంశాలపై అసక్తికరమైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలను కుదిపేసిన అంగన్‌వాడి వర్కర్ల సమస్యలు, కాల్‌మనీ వ్యవహారంపై మండలిలోనూ చర్చ జరగాలని విపక్షాలకు చెందిన సభ్యులు పట్టుబట్టారు. అంతేగాక, స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Pages