S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2015 - 07:10

జనగామ టౌన్, డిసెంబర్ 18: ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే ఐదు మాసాల్లో జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తాగునీరు అందించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

12/19/2015 - 07:09

హైదరాబాద్, డిసెంబర్ 18: దేశం లో అయుత చండీయాగాన్ని ఇంతవరకు ఒక్కసారే నిర్వహించారని, అదీ శృంగేరి పీఠం సారథ్యంలో జరిగిందని, ఆ తర్వాత నిర్వహిస్తున్నది తాను మాత్రమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాకతీయుల కాలంలో యా గం నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఆధారాలు ఏమీ లేవని, అందువల్ల ఈ యాగం నిర్వహిస్తున్న రెండవ వ్యక్తిని తానేనని ఆయన చెప్పారు. తనకు తెలిసినంతవరకు ఇది సత్యమని ఆయన అన్నారు.

12/19/2015 - 07:02

కడప, డిసెంబర్ 18: కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు భద్రంపల్లెకు చెందిన నలుగురు వైసిపీ కార్యకర్తలు అనుమానస్పద స్థితిలో బెంగళూరు శివార్లలో మృతిచెందిన నేపథ్యంలో వారి మృతదేహాలతో తొండూరు పోలీసుస్టేషన్ ఎదుట వైసిపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం భారీఎత్తున ధర్నా నిర్వహించారు.

12/19/2015 - 07:02

ఏలూరు, డిసెంబర్ 18: విజయవాడ కాల్‌మనీ దందా నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసులు జరుపుతున్న దాడులు మొత్తం ప్రైవేటు రుణ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. వడ్డీ వ్యాపారం పేరుతో రక్తం పీల్చేస్తూ, ఆస్తులను స్వాధీనం చేసుకునే బడా వ్యక్తుల భరతం పట్టడం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు.

12/19/2015 - 07:01

శ్రీకాకుళం, డిసెంబర్ 18: చిరు వ్యాపారులకు కాల్‌మనీ వేధింపులు ఉండబోవని విశాఖ రేంజ్ డిఐజి రవిచంద్ర అన్నారు. ఫిర్యాదులు అందిన మేరకే విచారణలు జరిపి, వాస్తవాలు వెలికితీసి కేసులు నమోదు చేస్తామని, చిన్న వ్యాపారులను వేదింపులకు గురిచేయబోమని స్పష్టం చేశారు.

12/19/2015 - 07:00

గుంటూరు, డిసెంబర్ 18: శాసనసభ నిర్వహణ తీరును గమనిస్తుంటే బాధాకరంగా ఉందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి సభలో ప్రస్తావించటం అవివేకమన్నారు.

12/19/2015 - 06:46

హైదరాబాద్, డిసెంబర్ 18: అసెంబ్లీ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసే విషయంలో టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలపై చర్చ జరిగింది.

12/19/2015 - 06:45

హైదరాబాద్, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాల్‌మనీ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో టిడిపి-వైకాపా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.

12/19/2015 - 06:44

హైదరాబాద్, డిసెంబర్ 18: రంగస్థల కళాకారుడు, నటుడు, నాటకప్రయోక్త చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. విజయవాడలో 1931లో జన్మించిన ఆయన జీవితాంతం నాటక రంగం అభివృద్దికి అంకితమయ్యారు.

12/19/2015 - 06:44

హైదరాబాద్, డిసెంబర్ 18: నగరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం అసెంబ్లీ ముగిసిన కొద్ది సేపటికే అసెంబ్లీ ఎదుట ఉన్న కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. కారు (ఎపి29సిబి0078)ఇంజన్‌లో ఏర్పడిన సమస్యవల్లే మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకొని పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.

Pages