S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/21/2015 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో కల్తీ నూడుల్స్, పహాడీ షరీఫ్‌లోని కల్తీ నూనె తయారు చేస్తున్న కేంద్రాలను సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు ఆదివారం సీజ్ చేశారు. ఆరుగురిని ఆరెస్టు చేసి ఏడు వందల నూడుల్స్ బస్తాలు, 70 బస్తాల పిండి, నాలుగు డ్రమ్ముల నూనెను స్వాధీనం చేసుకున్నారు.

12/21/2015 - 06:22

హైదరాబాద్, డిసెంబర్ 20: కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీరు అడగంటి డెడ్ స్టోరేజికి చేరుకోవడంతో వచ్చే వేసవిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 30 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

12/21/2015 - 05:39

విజయవాడ, డిసెంబర్ 20: కూచిపూడిని అభివృద్ధి చేసే విషయంలో నాట్యశాస్త్రాన్ని ఔపోసన పట్టి నాట్యరంగానికే జీవితాలను అంకితం చేసినవారే సారథ్యం వహించాలని, అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచారిణి, శంకరాభరణం ఫేం మంజుభార్గవి అన్నారు.

12/21/2015 - 01:41

విజయవాడ, డిసెంబర్ 20: మరో మూడురోజుల్లో అమరావతి మాస్టర్ ప్లాన్, ఈనెల 29లోగా రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమవుతాయని రాష్ట్ర పురపాలక మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసిన తరువాత సిఆర్‌డిఏ చట్టం సెక్షన్ 10(1) ప్రకారం నెల రోజుల పాటు రైతుల అభ్యంతరాలకు సమయం కేటాయిస్తామన్నారు.

12/21/2015 - 01:36

విశాఖపట్నం, డిసెంబర్ 20: కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. విశాఖ నగరం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం సంచలనం కలిగించింది. దిమడపు సూర్యనారాయణ (65), భార్య ఆదిలక్ష్మి (55), కుమారుడు శ్రీరాములు (22), ఆదినారాయణ (7) మృత్యువాత పడ్డారు.

12/21/2015 - 01:32

హైదరాబాద్, డిసెంబర్ 20: విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావించి హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.

12/20/2015 - 07:14

మహిళా మోర్చా ఇన్‌చార్జి పురంధ్రీశ్వరి జోస్యం

12/20/2015 - 07:13

ముసునూరు, డిసెంబర్ 19: తనకున్న పొలంలో వరుసగా మూడు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో పంటలు పండక, బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక ఒక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దయనీయ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొత్తూరులో శనివారం జరిగింది. కొత్తూరువాసి జోనుబోయిన నాగరాజు(40) తనకున్న రెండున్నర ఎకరాల్లో వ్యవసాయ సాగుకు ఒకటి తరువాత ఒకటి వరుసగా మూడు బోర్లు వేయించాడు.

12/20/2015 - 07:13

రాష్ట్ర ప్రభుత్వంపై జెపి విసుర్లు

12/20/2015 - 07:13

కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసు పరారీలోనే ట్రాన్స్‌కో డిఇ సత్యానందం

Pages