-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి, అమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారు, స్వామివారికి ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచవరణార్చనలు, జపానుష్టానాలు, హోమాలు జరిగాయి. సాయంత్రం నిత్యహవనాలు, బలిహరణలు నిర్వహించారు.
ప్రత్తిపాడు, జనవరి 14: నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని, రోడ్లు సరిగాలేవని, ప్రజలకు తాగడానికి నీరు లేదని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఎంపి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు వీలుగా తిరుగు ప్రయాణంలో మరిన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ను కోరారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఈ నెల 16, 17 తేదీల్లో నడపాలని రైల్వే బోర్డు చైర్మన్కు సూచించారు.
హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంతంలోని అర్చకులు, మతపరమైన ఆలయ సిబ్బంది (రిలీజియస్ ఎంప్లాయిస్) నిరాశకు గురవుతున్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (ఇఓ), ఆ పైస్థాయి ఉద్యోగుల తరహాలో తమకు కూడా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో గత ఏడాది కాలంగా ఏదో ఒకరకమైన ఆందోళన చేస్తూనే ఉన్నారు.
తిరుమల, జనవరి 14 : శ్రీవారి ఆలయంలో పని చేసే సిబ్బంది నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ ప్రవేశ మార్గం గుండా ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆలయంలోకి ప్రవేశించారు. డ్రైవర్లు ఖాకీ డ్రస్సు వేసుకోవడంతో భద్రతా సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. అయితే సిసి కెమేరాలు వాళ్లను పట్టించాయి. సిసి కెమేరాలను పర్యవేక్షించే సిబ్బంది అప్రమత్తమై డ్రైవర్లను పడికావలి వద్ద ఆపేశారు.
విజయవాడ, జనవరి 14: హైదరాబాద్ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం ఉదయం తన నివాస గృహం నుంచి హైదరాబాద్కు చెందిన తెలుగుదేశం ప్రముఖులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
ఆకాశాన్నంటాయ. ముంగిళ్లలో గొబ్బెమ్మలు,
హరిదాసులు, గంగిరెద్దు దాసరిలతో పర్వదినానికి
మరింత శోభ చేకూరింది. సంప్రదాయం, సంస్కృతి మేలుకలయకగా ప్రతి ఇంట వెలుగుపూలే పూశాయ.
...................................
సంక్రాంతి సందర్భంగా పాఠకులకు,
ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు
మేలు తలపులు.
ఏలూరు, అమలాపురం, జనవరి 14: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం నుండి కోడి పందాలకు తెరలేచింది. అలా, ఇలాకాదు... గ్రామ గ్రామాన కోడి పందాలతోపాటు పేకాట, గుండాట విచ్చలవిడిగా నిర్వహించారు. ‘మూడు రోజుల పాటు మీ జోలికి ఎవరూ రారు’ అంటూ నేతలిచ్చిన అభయహస్తం మాటున ఈ వ్యవహారం సాగిపోతోంది. ఉదయం 10 గంటల వరకు పోలీసులు హడావుడిచేసినా, ఆ తర్వాత పైనుండి వచ్చిన ఆదేశాలతో చేతులెత్తేశారు.
తిరుపతి, జనవరి 14 : ఆంధ్రరాష్ట్రం వచ్చే సంక్రాంతి నాటికి అన్ని రంగాల్లో పరిపూర్ణమైన అభివృద్ధి సాధించాలని తాను కాంక్షిస్తున్నానని అభివృద్ధికి రాష్ట్రం చిరునామా కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం విజయవాడనుంచి రేణిగుంటకు విమానంలో చేరుకున్నారు.
హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రతి రోజూ చెబుతున్నా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయించిన కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.