-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కరాచీ, ఫిబ్రవరి 9: భారత్లో వచ్చే నెల నుంచి జరిగే ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సమావేశంలో చర్చించామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపాడు.
సిడ్నీ, ఫిబ్రవరి 9: వచ్చే నెల నుంచి భారత్లో జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకూ ఆసీస్ టి-20 జట్టుకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్ను పక్కకు తప్పించి సెలెక్టర్లు మంగళవారం ఫించ్ను కెప్టెన్గా నియమించారు. అలాగే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్కు బదులుగా పీటర్ నెవిల్ను జట్టులోకి తీసుకున్నారు.
మీర్పూర్: ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో మూడుసార్లు చాంపియన్షిప్ సాధించిన భారత జట్టు మరోసారి టైటిల్కు చేరువైంది. మీర్పూర్ (బంగ్లాదేశ్)లోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో అన్మోల్ప్రీత్ సింగ్, సర్ఫ్రాజ్ ఖాన్ అర్థ శతకాలతో రాణించడంతో భారత అండర్-19 జట్టు 97 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించి ఈ టోర్నీలో ఐదోసారి ఫైనల్కు దూసుకెళ్లింది.
పుణే, ఫిబ్రవరి 9: శ్రీలంక యువ జట్టుతో మూడు మ్యాచ్ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటవగా, శ్రీలంక జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు సాధించి విజయ లక్ష్యాన్ని అధిగమించింది.
గౌహతి, ఫిబ్రవరి 8: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ పతకాల వేట కొనసాగుతున్నది. ఆర్చర్లు, రెజ్లర్లు, వెయిట్లిఫ్టర్లు అద్భుతంగా రాణించి, పతకాలను అందించారు. మొత్తం మీద సోమవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 70 పతకాలతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. వీటిలో 46 స్వర్ణం, 18 రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
మీర్పూర్, ఫిబ్రవరి 8: అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్షిప్ ఫైనల్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా భారత జట్టు మంగళవారం షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగే సెమీ ఫైనల్లో తలపడేందుకు అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయాలను నమోదు చేసిన భారత్ అదే దూకుడును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.
పుణే: శ్రీలంకతో పోరుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధంగా ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాను టి-20 సిరీస్లో 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ధోనీ సేన, లంకతో టి-20 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా మొదటి టి-20 మ్యాచ్ మంగళవారం జరగనుంది.
పుణే, ఫిబ్రవరి 8: గాయాల సమస్య తమను తీవ్రంగా వేధిస్తున్నదని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ వాపోయాడు. తాజాగా బినురా ఫెర్నాండో గాయం కారణంగా మొదటి టి-20 మ్యాచ్కు దూరమయ్యాడని సోమవారం విలేఖరులోత మాట్లాడుతూ అన్నాడు. టి-20 ఫార్మెట్లో లంక రెగ్యులర్ కెప్టెన్ లసిత్ మలింగ,, టెస్టు జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఇప్పటికే గాయాల కారణంగా భారత్తో సిరీస్కు హాజరుకాలేదు.
హామిల్టన్, ఫిబ్రవరి 8: ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన అత్యంత కీలక, చివరి వనే్డలో 55 పరుగులతో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ను 2-1 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. వనే్డ ఫార్మెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్కు విజయంతో ఘనంగా వీడ్కోలు పలికేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు విశేషంగా శ్రమించారు.