-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కరాచీ, మే 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లాను ఎంపిక చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతని పేరును ఏకగ్రీవంగా ఆమోదించారని విశ్వసనీయ వర్గాలు పిటిఐకి తెలిపాడు. ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ దారుణంగా విఫలమైన కారణంగా కోచ్ వకార్ యూనిస్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, మే 4: ఐపిఎల్లో భాగంగా గురువారం జరిగే గ్రూప్ మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ కెప్టెన్కు మహేంద్ర సింగ్ ధోనీకి ఢిల్లీ డేర్డెవిల్స్ సారథి జహీర్ ఖాన్ సవాళ్లు విసరనున్నాడు. గత ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అట్టడుగు స్థానంలో నిలవగా, అంతకంటే కేవలం ఒక స్థానం మెరుగైన స్థితిలో ఉన్న డేర్డెవిల్స్ ఈసీజన్లో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతున్నది.
న్యూఢిల్లీ, మే 4: జింబాబ్వేలో టీమిండియా పర్యటించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గ్రీన్ సిగ్నలఇ ఇచ్చింది. జూన్ మాసంలో భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తుందని జింబాబ్వే క్రికెట్ (జెడ్సి) ప్రకటించిన విషయం తెలిసిందే. బిసిసిఐ తమ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయాల్సి ఉందని స్పష్టం చేశాడు. కాగా, జెడ్సి ప్రతిపాదనను అంగీకరించిన బిసిసిఐ ఈ టూర్ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
దుబాయ్, మే 4: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీమిండియా జట్టు వనే్డ ర్యాంకింగ్స్లో ఒకటి నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కాగా, వనే్డ ఫార్మెట్ బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి టి-20 ఫార్మెట్లో అగ్రస్థానం దక్కింది.
న్యూఢిల్లీ, మే 3: క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు స్టార్ బ్యాట్స్మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. అదే విధంగా అర్జున అవార్డుకు ఆజింక్య రహానే పేరును సిఫార్సు చేసింది. నాలుగు సంవత్సరాల కాలంలో ఖేల్ రత్న అవార్డుకు బిసిసిఐ పేరు పంపించడం ఇదే మొదటిసారి.
లండన్, మే 3: లీసెస్టర్ సిటీ జట్టు తొలి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న లీసెస్టర్ సిటీకి ఇంత వరకూ ఈ టైటిల్ దక్కలేదు. ఒకసారి ఫైనల్ చేరినప్పటికీ, రన్నర్ ట్రోఫీతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
కోల్కతా, మే 3: ఈసారి ఐపిఎల్లో ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్లు ఆడి, ఐదు విజయాలను నమోదు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉంది. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగడం నైట్ రైడర్స్ బలాన్ని పెంచుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సోమవారం నాటి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడించిన నైట్ రైడర్స్కే విజయావకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ, మే 3: రియో ఒలింపిక్స్కు మన దేశంలో గుడ్విల్ అంబాసిడర్గా సచిన్ తెండూల్కర్ పేరును భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఏస్ షూటర్ అభినవ్ బింద్రాలను గుడ్విల్ అంబాసిడర్స్గా ఐఒఎ ఇప్పటికే ఖరారు చేసింది. తాజాగా సచిన్ పేరును కూడా ఖాయం చేసింది. అతను తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాడని ఐఒఎ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు.
రాజ్కోట్, మే 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, గుజరాత్ లయన్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. దినేష్ కార్తీక్ అర్ధ శతకంతో రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.
బెంగళూరు, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. యూసుఫ్ పఠాన్ విజృంభణకు, ఆండ్రె రసెల్ తోడు కావడంతో ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచిన నైట్ రైడర్స్ బరో ఐదు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది.