S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/28/2020 - 01:38

వివిధ దేశాలలో ‘జాతీయ భావనిష్ఠ’ పెరుగుతుండడం పట్ల జార్జి సోరోస్ అనే ఘరానా వ్యాపారవేత్త వ్యక్తం చేసిన ‘ఆందోళన’కు మన దేశంలో గొప్ప ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మన దేశంలో ‘హైందవ జాతీయతా నిష్ఠ పెరుగుతుండడం’ ఈ పెట్టుబడిదారునికి తీవ్రమైన బాధను కలిగిస్తోందట!

01/26/2020 - 02:38

స్వభూమీయ మంగళకర
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ సుప్రభాత
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
తూర్పువైపు చూస్తున్నవి..
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణిని వెలిగిస్తున్నవి....

01/24/2020 - 01:01

మన స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్‌డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుదల వేగం గురించి అధికార, అనధికార కథనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. ఇలా మారిపోతుండడం ‘ప్రపంచీకరణ’ విస్తరింపచేస్తున్న మాయాజాలంలో భాగం! ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- కల్పిస్తున్న ‘ప్రగతి భ్రాంతి’లో భాగం... ప్రపంచీకరణ ముదురుకొద్దీ విదేశీయ, అంతర్ జాతీయ సంస్థల అక్రమ ప్రమేయం పెరుగుతోంది!

01/23/2020 - 04:43

పార్టీ ఫిరాయింపులకు పాలుపడుతున్న ‘చట్టసభల’ ప్రతినిధుల ‘అనర్హత’ గురించి నిర్ధారించడానికై ‘శాశ్వత న్యాయ మండలి’- పర్మినెంట్ ట్రిబ్యునల్-ని ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం హర్షణీయ రాజ్యాంగ పరిణామం! ఈ పరిణామం చట్టసభల అధ్యక్షుల ‘ముసుగు’లోని రాజకీయవేత్తలకు అభిశంసనం... నిష్పక్షపాతం వ్యవహరించడం చట్టసభల అధ్యక్షులు- స్పీకర్‌లు- నిర్వర్తించవలసిన రాజ్యాంగ విధి.

01/22/2020 - 05:43

గుజరాత్‌లో గత ఏడు, రాజస్థాన్‌లో నెలల తరబడి మిడతల దండు దాడి చేస్తుండడం అన్నదాతల ఆక్రందన చరిత్రలో సరికొత్త వైపరీత్యం. ఈ మిడతల గుంపు ఒకసారి పొలంపై కూర్చుండి పైకి లేచినట్టయితే కొన్ని వందల ఎకరాలలో పంట నష్టమైపోతోందని రాజస్థాన్ రైతులు వాపోతున్నారట.

01/21/2020 - 01:11

జమ్మూకశ్మీర్‌లోని ‘లోయ’ ప్రాంతంలో ‘సర్వమత సమభావ’ వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకొనకపోవడం కొనసాగుతున్న విషాదం. లక్షలాది కశ్మీరీ హిందువులు దశాబ్దులుగా శరణార్ధులుగా జీవించవలసి రావడం ఇందుకు ప్రధాన నిదర్శనం. ఈ హిందువులు ప్రధానంగా కశ్మీరీ పండితులు. క్రీస్తుశకం 1947లో అఖండ భారత విభజన జరగడం ఈ ‘పండితుల’ విషాద గాథకు ఆరంభం... 1947నుంచి జిహాదీ బీభత్సకారులు మన జమ్మూకశ్మీర్‌లోకి చొఱబడుతూనే ఉన్నారు.

01/19/2020 - 00:55

అమెజాన్- అన్న విదేశీయ వాణిజ్య సంస్థ పెట్టుబడుల గురించి కేంద్ర వాణిజ్య పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు ‘బహుళ జాతీయ వాణిజ్య’- మల్టీ నేషనల్- అవినీతి విస్తరిస్తూ ఉండడం వికృతమైన నేపథ్యం! ‘నేపథ్యం’ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒక ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఎమ్‌ఎన్‌సి-ను మన ప్రభుత్వ ప్రతినిధి పేరుపెట్టి, విమర్శించడం మాత్రం హర్షణీయ పరిణామం.

01/17/2020 - 00:04

‘ప్లాస్టిక్’ కీర్తి పతాకం అంబరాన్ని చుంబించడం ‘మకర సంక్రాంతి’ సందర్భంగా దేశమంతటా ఆవిష్కృతమైన దృశ్యమాలిక! తెలంగాణ రాజధాని ప్రాంగణంలో జరిగిన ‘పతంగుల పండుగ’లో కూడ ‘ప్లాస్టిక్’ ప్రాభవం మరోసారి ప్రస్ఫుటించడం ప్రాధాన్య చిహ్నం. జన జీవన వ్యవహారంలో ‘ప్లాస్టిక్’ వస్తువులకు ‘పదార్థపరంపర’కు కొనసాగుతున్న ప్రాధాన్యం ఇది!

01/15/2020 - 04:15

మానవుల అస్తిత్వానికి మాత్రమేకాదు, సకల జీవజాలం మనుగడకు సనాతన ప్రాతిపదిక పుడమి తల్లి... భూమి లేనట్టయితే ఏమీ ఉండదన్నది ఈ సనాతన ప్రాతిపదిక! ‘సనాతనం’ అని అంటే శాశ్వతమైనది- ఎటర్నల్- అని అర్థం. ఈ పుడమి ప్రాధాన్యాన్ని గుర్తించినవారు భారతీయులు! అనాదిగా ‘‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి నేను ఆమె బిడ్డను- అన్న వాస్తవం హైందవ జాతీయ జీవన వాస్తవం కావడం నడుస్తున్న చరిత్ర, యుగయుగాల చరిత్ర.

01/14/2020 - 04:28

మన ‘విమాన వాహక యుద్ధనౌక‘ ‘విక్రమాదిత్య’ అరేబియా సముద్ర జలాలలో భద్రతా యాత్రకు ఉపక్రమించడం చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి దురాక్రమణను ప్రతిఘటించడంలో భాగం. ఈ విమాన వాహక యుద్ధ నౌక-ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లో నిహితమై ఉన్న విమాన ప్రాంగణంనుంచి పైకి దూసుకెళ్లిన ‘మిగ్-29కె’ విమానాలు అరేబియా సముద్ర గగన తలంపై విన్యాసాలు చేయడం గత శుక్రవారం ఆవిష్కృతమైన దృశ్యం...

Pages