రాష్ట్రీయం

రైల్వే టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నలుగురు యువకుల కిడ్నాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, జూన్ 23: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో నలుగురు యువకుల కిడ్నాప్‌నకు గురయ్యారు. కోల్‌కతాకు చెందిన ఒక ముఠా చాగల్లుకి చెందిన నలుగురు యువకులకు రైల్వేలో టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుండి రూ.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వారంరోజుల క్రితం కోల్‌కతా నలుగురు యువకులకు ఉద్యోగాలు వచ్చాయని, విధుల్లో చేరటానికి రావాలని ఫోన్లో తెలియజేశారు. దాంతో ఆ యువకులు నలుగురు కోల్‌కతా వెళ్లారు. కోల్‌కతాకు వెళ్లిని ఆ నలుగురు యువకులను ఒక గదిలో బంధించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు 30 లక్షల రూపాయలు చెల్లిస్తేనే వారిని విడిచిపెడతామని ముఠా సభ్యులు హెచ్చరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే యువకులను చంపేస్తామని బెదిరించారు. దాంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నలుగురి యువకుల్లో ఒక యువకుడి తండ్రి ఫిర్యాదు చేశారు. చాగల్లు ఎస్సై ఎం జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.