ఆంధ్రప్రదేశ్
గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
విజయవాడ, సెప్టెంబర్ 18: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. కాకినాడలోని ఓడరేవుల సంచాలకుని నివేదికను పరిశీలించాక విచారణ అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణను జాయింట్ కలెక్టర్తో జరిపించాలని ఆ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. వైఫల్యాలు, లోపాలు తదితర అంశాలపై విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక అందచేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.