రాష్ట్రీయం

తండ్రి,వదినను చంపిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, నవంబర్ 28: కన్నతండ్రి, వదిన అని కూడా చూడకుండా రొకలికర్రతో తలపై మోది చంపాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై రవికాంతరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చంద్రకల్ గ్రామానికి చెందిన ముంగిమళ్ల సాయప్ప (50)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వికలాంగుడు కాగా చిన్న కుమారుడు మతిస్థిమితం లేని వాడు. అయితే రోజులాగే శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు అశోక్ (26) తండ్రి సాయప్పను లేపి గొడవ పడ్డాడు. పక్కనే ఉన్న వదిన (లక్ష్మి) మేల్కోవడంతో రోకలి కర్రతో బాదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తండ్రి సాయప్పను కూడా తలపై రోకలికర్రతో బాదడంతో ఇద్దరూ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వదిన మృతదేహాన్ని ఇంటి ముందు వాకింట్లోకి లాగాడు. తండ్రి మృతదేహాన్ని గ్రామంలోని బసవేశ్వర దేవాలయం పక్కన పడేశాడు. తెల్లవారుజామున చుట్టుపక్కలవారు లక్ష్మి మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రవికాంతరావు సంఘటనతో చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి నారాయణపేట సిఐ రవీంద్రప్రసాద్ వచ్చి పరిశీలించి ఘటనపై గల వివరాలను ఎస్సై రవికాంతరావును అడిగి తెలుసుకున్నారు.