S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/25/2016 - 07:26

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దర్యాపునకు మానవ వనరుల శాఖ నియమించిన జ్యుడీషియరీ కమిటీలో దళిత సభ్యుడు లేడంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభను స్తంభింపచేసింది. బిఎస్పీ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభ దద్దరిల్లింది.

02/25/2016 - 06:47

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ జిల్లాలకు నిధులు ఇవ్వాల్సిన నేపథ్యంలో మొత్తం 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన వెనుకబడిన ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదల చేసింది .

02/25/2016 - 05:31

జెఎన్‌యు అధికారులే ధ్రువీకరించారు
రోహిత్ ఘటనపై సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేశా
కనీసం ఎంపీ కవిత కూడా స్పందించ లేదు
తెలంగాణ బలిదానాలు పట్టని రాహుల్
హైదరాబాద్ వర్సిటీకి రెండుసార్లు వచ్చాడు
శవ రాజకీయాలకు తెరలేపడం సబబా?
విద్యా వ్యవస్థ కాషారుూకరణ అబద్ధం
రుజువు చేస్తే తప్పుకుంటా
విపక్షాలపై నిప్పులు చెరిగిన స్మృతిఇరానీ
వర్శిటీల ఘటనలపై లోక్‌సభలో దుమారం

02/25/2016 - 05:28

న్యూఢిల్లీ: జెఎన్‌యు వివాదానికి సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసుల వద్ద లొంగిపోయిన విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యను ఐదుగంటలపాటు విచారించారు. బుధవారం వేకువ జామున ఇరువురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారిద్దరినీ ప్రశ్నించారు. కనీసం ఐదు గంటలపాటు విద్యార్థులను ఇంటరాగేషన్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

02/25/2016 - 05:17

న్యూఢిల్లీ: రైల్వేల ఆర్థిక స్థితి గడ్డుగావున్న నేపథ్యంలో ప్రయాణికుల, సరకు రవాణా చార్జీలను పెంచాలా వద్దా? అన్న చిక్కుముడిని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎదుర్కొంటున్నారు.

02/25/2016 - 05:08

న్యూఢిల్లీ: విభజన చట్టం హామీలను అమలు చేస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రక్రియ వేగవంతం చేయాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో రాజ్‌నాథ్ సింగ్‌ను జగన్ కలిసి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై చర్చించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.

02/24/2016 - 18:14

దిల్లీ: దేశంలో మతతత్వానికి, అసహనానికి బిజెపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన లోక్‌సభలో బుధవారం మాట్లాడుతూ, తనను చూస్తే ప్రభుత్వం భయపడుతోందన్నారు.

02/24/2016 - 18:12

దిల్లీ: జెఎన్‌యు, హెచ్‌సియులో ఇటీవలి సంఘటనలపై లోక్‌సభలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దేశద్రోహం కేసులో ఉరితీసిన అఫ్జల్‌గురుకు మద్దతుగా జెఎన్‌యులో కొందరు విద్యార్థులు నినాదాలు చేయడం భావ్యమా? అని బిజెపి సభ్యులు నిలదీశారు. అఫ్జల్‌గురు ఉగ్రవాది అవునో, కాదో కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పష్టం చేయాలని బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.

02/24/2016 - 15:48

చెన్నై: అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత 68వ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వేడుకల్ని గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం నాడు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ చేతులపై జయలలిత బొమ్మను పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. ఆమె బొమ్మ ఉన్న టీషర్టులను ధరించి సందడి చేస్తున్నారు.

02/24/2016 - 15:48

దిల్లీ: హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిఎస్పీ ఎంపీ మాయావతి ఈరోజు సభలో రోహిత్ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆమె ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టిన సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం నెలకొంది.

Pages