S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/31/2016 - 03:16

డులియజాన్ (అస్సాం), మార్చి 30: కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత గత 18 నెలల్లో దేశంలో తీవ్రవాదం గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయుధాలు విసర్జించి చర్చలకు రావాలని అస్సాంలోని అన్ని తీవ్రవాద సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు.

03/31/2016 - 03:15

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్ర వక్ఫ్ బోర్డులు సక్రమంగా పనిచేయని పక్షంలో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తానని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెఫ్తుల్లా హెచ్చరించారు. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకున్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖానికి మసి పూయాలని కూడా ఆమె సూచించారు.

03/31/2016 - 03:14

న్యూఢిల్లీ, మార్చి 30: భారత్ ప్రతిష్టను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోందని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడుతూ ఉగ్రవాదులతో సంబంధాలు నెరపుతున్నట్టు పాక్ చేస్తున్న ఆరోపణలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కట్టుకథలు వండుతూ, నకిలీ వీడియోలతో బరితెగించి ప్రవర్తిస్తున్నారని మంత్రి విరుచుకుపడ్డారు.

03/31/2016 - 03:13

న్యూఢిల్లీ, మార్చి 30: కళ్లముందు ప్రమాదం జరిగినా మనకెందుకులే అని తప్పించుకుపోయే వారికి రక్షణ కవచం లాంటి మార్గదర్శకాలు వచ్చాయి. తోటి మనిషిని ఆదుకునేవారిని ఏ విధంగానూ పోలీసులుగాని, అధికారులుగాని ఇతర కారణాలతో వేధించకుండా చూసే మార్గదర్శకాలను సుప్రీం కోర్టు బుధవారం ఆమోదించింది.

03/31/2016 - 02:51

భద్రాచలం/ చింతూరు, మార్చి 30: చత్తీస్‌గఢ్‌లో బుధవారం మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలతో మారణహోమం సృష్టించారు. దంతెవాడలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేసిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లాలోప్రెషర్‌బాంబు పేల్చి ఇద్దరు జవాన్లను తీవ్రంగా గాయపరిచారు.

03/31/2016 - 02:43

థోవ్రా/ మోరాన్ (అసోం), మార్చి 30: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడి కుట్ర మూలాలు తమ దేశంలోనే ఉన్నాయన్న విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడిక్కడ వెల్లడించారు.

03/31/2016 - 02:35

నైనిటాల్, మార్చి 30: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ డ్రామా బుధవారం మరో మలుపు తిరిగింది. 31న అసెంబ్లీలో బలపరీక్ష నిరూపణ జరపాలంటూ ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ బల పరీక్షను వాయిదా వేసింది. ద్విసభ్య బెంచ్ తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి కొండంత ఊరట కలిగించింది.

03/30/2016 - 17:49

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ వాహనాన్ని బుధవారం మందుపాతరతో పేల్చివేయడంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. జవాన్లు ఈ వాహనంలో దంతెవాడ నుంచి మైలవరం వెళ్తుండగా మావోలు పసిగట్టి మందుపాతర పేల్చారు.

03/30/2016 - 17:48

నైనిటాల్: ఉత్తరప్రదేశ్‌లో సిఎం హరీష్ రావత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో ఈ నెల 31న బలపరీక్ష జరగాల్సి ఉండగా, అది జరగడానికి వీలులేదని హైకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ విషయమై కేసు విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది. వెంటనే అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

03/30/2016 - 17:48

ముంబయి: పురుషులు పూజలు చేసే ఏ ఆలయంలోనైనా- మహిళలను అడ్డుకునేందుకు ఏ చట్టం అనుమతించదని ముంబయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. మహారాష్టల్రోని ఔరంగాబాద్ జిల్లా శనిషింగనాపూర్ ఆలయంలో ప్రవేశించేందుక మహిళలు అర్హులేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అనాదిగా ఈ శని ఆలయంలో మహిళలకు అనుమతి లేకపోవడంపై ఇటీవల కొందరు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Pages