-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, మాజీ క్రికెటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు, ఒలింపిక్ గోల్డ్మెడలిస్టు మేరీకోమ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్టప్రతి ఆమోదముద్ర వేశారు. ప్రముఖ సినీ రచయిత సలీమ్ఖాన్, మలయాళ నటుడు సురేష్ గోపిలను కూడా పెద్దల సభ ఎంపికయ్యారు. రాజ్యసభలో ఖాళీ స్థానాలు భర్తీ చేయాలని అధికార బిజెపి నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఉత్తరాఖండ్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న రాజకీయ డ్రామా సరికొత్త మలుపు తిరిగింది. రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 27వరకూ స్టే విధిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. అలాగే, హరీశ్ రావత్ సర్కారు పునరుద్ధరణకూ బ్రేకు వేసింది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 234 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ మే 2వ తేదీతో ముగుస్తుంది. మే 16న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 19న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
దిల్లీ: రాజ్యసభలో ఖాళీగా ఉన్న ఏడు నామినేటెడ్ ఎంపీ పదవులకు ప్రముఖులను ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తోంది. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, క్రికెటర్, రాజకీయ వేత్త నవజీత్ సింగ్ సిద్ధూ, మహిళా బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్, మలయాళం నటుడు సురేష్ గోపి, సినీ రచయిత సలీం ఖాన్, పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్ను నామినేట్ చేయనున్నట్తు తెలుస్తోంది.
దిల్లీ: ఉత్తరాఖండ్లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 27న తాము తీర్పు ఇచ్చేవరకూ ‘స్టే’ అమలులో ఉంటుందని సుప్రీం తెలిపింది. అప్పటి వరకూ గవర్నర్కే అన్ని అధికారాలూ ఉంటాయి. సుప్రీం స్టేతో మాజీ సిఎం హరీష్ రావత్కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.
దిల్లీ: ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని కూలదోసి రాష్టప్రతి పాలనకు తాను కారకుడినంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని యోగా గురువు బాబా రామ్దేవ్ శుక్రవారం మీడియాతో అన్నారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిజెపి నేతలతో కుమ్మక్కై తాను ఉత్తరాఖండ్లో సంక్షోభాన్ని సృష్టించాననడంలో అర్థం లేదన్నారు.
రాయ్పూర్: చత్తీస్గఢ్లోని బస్తర్- సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం సిఆర్పి జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
చండీగఢ్: హర్యానాలో రోహతక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కాకాను శుక్రవారం ఉదయం దుండగులు కాల్చి చంపారు. రోహ్తక్లో ఆయన మార్నింగ్ వాక్కు వెళ్లినపుడు ముగ్గురు ఆగంతకులు వచ్చి తుపాకులు పేల్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంబయి: కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఇక్కడ లోకల్ రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసేందుకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ లోకల్ రైలు ఎక్కారు. ఫస్ట్క్లాస్ కంపార్ట్మెంటులో ఎక్కిన ఆయన గమ్యస్థానం చేరేవరకూ నిలబడే ప్రయాణించారు. ఆయన వెంట రైల్వేశాఖ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నారు.
దిల్లీ: అసెంబ్లీలో తన ప్రవర్తనకు సంబంధించి వివరణతో కూడిన క్షమాపణ చెప్పుకునేందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా ఈరోజు సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు.