S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/27/2016 - 13:43

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (నీట్)ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే మంజూరు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.

05/27/2016 - 13:42

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చొరబడిన ఉగ్రవాదులపై భారత సైనికులు శుక్రవారం ఉదయం కాల్పులు ప్రారంభించారు. సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నందున ఆ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది.

05/27/2016 - 11:53

జైపూర్: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ జీపును లారీ ఢీకొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేడియా గ్రామానికి చెందినవారు ఓ వేడుకకు హాజరై భిల్వారా నుంచి జీపులో తిరిగి వస్తుండగా లారీ ఢీకొంది.

05/27/2016 - 06:15

న్యూఢిల్లీ, మే 26: ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను అన్ని రాష్ట్రాల్లోనూ నీట్ అమలును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ఒకటి రెండు రోజుల్లో వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఇండోర్‌కు చెందిన వైద్యుడు ఆనంద్‌రాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

05/27/2016 - 05:33

న్యూఢిల్లీ,మే 26: పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ గాయపరిచాయని, ఆయన దేవుడిపైన కూడా వ్యాఖ్యలు చేసేంత పెద్దవాడైపోయారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

05/27/2016 - 04:39

సహరాన్‌పూర్, మే 26: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో 125కోట్ల మంది భారతీయులకు సదా సేవలందిస్తూ వచ్చానని ప్రకటించిన మోదీ ‘నేను ప్రధానిని కాదు.. మీ ప్రధాన సేవకుడ్నే. అలాగే కొనసాగుతా..’నని పునరుద్ఘాటించారు.

05/27/2016 - 04:37

సహరాన్‌పూర్, మే 26:దేశంలో వైద్య సేవల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచుతున్నామని ప్రధాని మోదీ గురువారంనాడిక్కడ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం వారంలోనే తన ఆమోదం తెలుపుతుందన్నారు.

05/27/2016 - 04:37

న్యూఢిల్లీ, మే 26: అత్యాచార బాధిత మహిళల కోసం నిర్భయ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధి కంటితుడుపుచందంగానే ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిర్బయ నిధి ఏ మాత్రం సరిపోనందున బాధిత మహిళలకు పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించేందుకు జాతీయ స్థాయిలో పరిహార విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

05/27/2016 - 04:23

న్యూఢిల్లీ,మే 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే తుది నిర్ణయమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

05/27/2016 - 04:21

న్యూఢిల్లీ, మే 26: బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ ప్రేరక రసాయనాలు వాడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వాటి వాడకాన్ని ఆపుతున్నట్లు అఖిల భారత బ్రెడ్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుంచి పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ వంటి పదార్థాల వాడకాన్ని బ్రెడ్ ఉత్పత్తుల్లో వాడటాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.

Pages