S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2016 - 00:34

చండీగఢ్, జూలై 21: బిఎస్పీ అధినేత్రి మాయవతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత దయాశంకర్ సింగ్ నాలుక కోస్తే రూ.50 లక్షలు బహుమతిగా ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ నేత ఆఫర్ ఇచ్చారు. యూపీలో బిఎస్పీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. అయితే సింగ్ నాలుక కోసి తెస్తే 50 లక్షలు ఇస్తామని చండీగఢ్ బిఎస్పీ ఎమ్మెల్యే ఉషా చౌదరి ప్రకటించారు.

07/22/2016 - 00:33

డెహ్రాడూన్, జూలై 21: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ బిజెపి సభ్యులు ఇచ్చిన నోటీసులు గురువారం వీగిపోయాయి. అంతకుముందు సభలో ప్రిసైడింగ్ అధికారిని స్పీకర్ ఆహ్వానించిన అంశం రాజ్యాంగబద్ధతపై బిజెపి సభ్యులకు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.

07/22/2016 - 00:32

న్యూఢిల్లీ, జూలై 21: హిందీ రాష్ట్రాల్లోని ఓటర్లకు చేరువ కావాలన్న లక్ష్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల బస్సు యాత్రను శనివారం నుంచి చేపట్టబోతోంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు జరిగే ఈ యాత్రలో ‘27సాల్ యూపి బేహాల్’ (27ఏళ్లలో ఉత్తరప్రదేశ్ సర్వ నాశనమైంది) అనే నినాదాన్ని ప్రచారంలోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

07/21/2016 - 18:19

ముంబయి: ముంబయి ఎయిర్‌పోర్టులో జరిగిన తోపులాటలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ తల్లి బృందా రాయ్‌ స్వల్పంగా గాయపడ్డారు. లండన్‌లో సెలవులను గడిపి ఐశ్వర్య, తల్లి బృందా, కుమార్తె ఆరాధ్యతో కలిసి గురువారం ముంబయి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఐశ్వర్య కన్పించగానే ఒక్కసారిగా మీడియా ఆమెను చుట్టుముట్టింది.ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అదుపుతప్పిన బృందారాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆమె ముఖానికి స్వల్ప గాయమైంది.

07/21/2016 - 18:14

లక్నో: పేదప్రజల పాలిట తానొక దేవతలాంటి దాన్నని బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి అన్నారు. తనను కించపరుస్తూ బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు చేసినందుకు పేదలు మనస్తాపం చెందుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. తనను ఇంతగా అభిమానిస్తున్నందుకే పేదలు తన కోసం ఇపుడు రోడ్కెక్కారని ఆమె అన్నారు.

07/21/2016 - 18:13

దిల్లీ: ఇతరులకు క్షమాపణలు చెప్పడమన్నది గాంధీ కుటుంబానికి తెలియదని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకు అతను క్షమాపణ చెప్పాలి లేదా పరువునష్టం కేసులో విచారణకు సిద్ధం కావాలంటూ సుప్రీం కోర్టు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ దిగ్విజయ్ ఈమాటలన్నారు.

07/21/2016 - 17:48

నలంద: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలంద జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్‌ జెండానుఎగురవేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కుటుంబ సభ్యులు అప్పటికే పాక్ జెండాను తొలగించారు. ఇంట్లో ఉన్న పాక్ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఎగురవేసిన అన్వరుల్ హక్ పరారిలో ఉన్నాడు.

07/21/2016 - 17:24

దిల్లీ: మహారాష్ట్ర కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏబీపీ పాండేను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. యూఐడీఏఐకి నియమించిన తొలి సీఈవో పాండేనే కావడం గమనార్హం.

07/21/2016 - 16:40

చండీగఢ్: తమ పార్టీ అధినేత్రి, యుపి మాజీ సిఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ నాలుకను కోసి తనకు ఎవరైనా ఇస్తే అక్షరాలా అరకోటి రూపాయలను నజరానాగా ఇస్తానని జన్నత్ జహాన్ అనే మహిళా నేత ఆఫర్ ప్రకటించింది. బిఎస్‌పి చండీగఢ్ విభాగం అధ్యక్షురాలిగా ఉన్న జన్నత్ గురువారం నాడు దయాశంకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

07/21/2016 - 16:36

లక్నో: బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ కోసం యుపి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మాయావతిని కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు తొలుత పోలీసులు బలియా వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని తెలియడంతో లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Pages