S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టాలీవుడ్లో నటీమణుల కబడ్డీ నిర్వహిస్తున్నామని విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు కె.విక్రమాదిత్య తెలిపారు. దాదాపు 35మంది నటీమణులతో తొలిసారిగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఆలోచన కొత్తగా వుండడంతో టీవీ ఆర్టిస్టులు కూడా ఈ పోటీలో పాల్గొననున్నారని, జూలై నెలలో ఈ కార్యక్రమం జరుగుతుందని కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీ సాయి లక్ష్మీ మూవీస్ పతాకంపై శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్రెడ్డి రూపొందించిన చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి.
రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ రూపొందించిన ‘అంతం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు ఈ సినిమాకు సంబంధించిన హక్కులను తీసుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ‘ఎ’ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రం ఈనెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది.
దండుపాళ్యం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, మకరంద్ దేశ్పాండే, రవికాలె ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి భాగం దాదాపు 30 కోట్లు వసూలు చేసి చిన్న చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు.
హాలీవుడ్లో ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో జాకీచాన్ ఇండో ఓవర్సీస్ పతాకంపై రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘అమెజాన్ యోధులు’. 500 కోట్ల బడ్జెట్తో హైటెక్నికల్ విలువలతో రూపొందించిన ‘ది లెజండరీ అమెజాన్’ చిత్రాన్ని తెలుగులో సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్ యోధులు’ పేరుతో అనువదించారు.
హీరో నితిన్ తాజాగా నటించిన ‘అ ఆ’ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్పై బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన అ ఆతో మరింత ఉత్సాహం తెచ్చుకున్న నితిన్, తదుపరి చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల కథకు ఓకె చెప్పాడని టాలీవుడ్ సమాచారం.
పరాయి భాషా కథానాయికలకు టాలీవుడ్లో హీరోయిన్గా వెలిగిపోవాలని కోరిక వుండడం సహజమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పుడు మరో పంజాబీ భామ టాలీవుడ్కి పరిచయం కానుంది. ‘అందాల రాక్షసి’ కథానాయకుడు నవీన్ చంద్ర, సంజీవ్కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బుర్రకథ’ చిత్రంలో కథానాయికగా రోనికా సింగ్ను ఎంపిక చేశారు.
కొంత గ్యాప్ తీసుకున్న తరువాత అల్లరి నరేష్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారనున్నాడు. దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డితో భారీ చిత్రాన్ని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్తో ఓ చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వినవయ్యా రామయ్యా’ కథానాయికగా నటించిన కృతికా జయకుమార్ని ఎంపిక చేశారు. కృతికా జయకుమార్ ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కూతురిగా నటించిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎంతపని చేశావే శిరీషా’. శివరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పట్లూరి బాలకృష్ణ, రామ్ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పునర్నవి భూపాలం కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో బుధవారం ఉదయం జరిగింది.
నందమూరి బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలో శాతకర్ణి భార్య వాసిష్ఠ పాత్రకు హీరోయిన్ శ్రీయను ఎంపిక చేశారు. తొలుత నయనతారను తీసుకోవాలని భావించినా, ఆమె డేట్స్ కుదరకపోవడంతో దర్శకుడు క్రిష్ శ్రీయను ఎంపిక చేసినట్లు సమాచారం.