S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమీర్పేటలో’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, ఎప్పుడూ రద్దీగా వుండే అమీర్పేటలో అనేక రకాల మనస్తత్వాల మనుషులు తిరుగుతుంటారని, వారిని క్షుణ్ణంగా పరిశీలించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, మంచి విజయం సాధించాలని అన్నారు.
కళ్యాణ్రామ్ కథానాయకుడిగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రం ‘ఇజం’. దీనికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్లో నాన్స్టాప్గా జరుగుతోంది. ఆగస్టు 9 నుంచి నెలాఖరువరకు స్పెయిన్లో భారీ షెడ్యూల్ జరుగుతుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్రెడ్డి రూపొందించిన చిత్రం ‘జక్కన్న’. ఈనెల 29న దీన్ని విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, అందరినీ మెప్పించేలా ఉన్న ఈ సినిమాను ఈనెల 29న గ్రాండ్గా విడుదల చేస్తామన్నారు.
శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై నాగశౌర్య, పారుల్, సరయు ప్రధాన తారాగణంగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీ జత లేక’. ఈ చిత్రం ఆడియోకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది.
ఆర్.జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీష్, అవంతిక, సాయికుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరో హరీష్ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో చిత్ర విశేషాలను తెలిపారు. దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ, హరీష్ను తాము పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు.
పవన్ కళ్యాణ్ నటించే ‘కడప కింగ్’ షూటింగ్ వచ్చే నెల 6న మొదలుకానుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న దీనికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, ఇప్పుడు ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలీ సీన్లోకి వచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన ఈ సినిమా సెట్స్పైకి రానుంది. ఈ సినిమా తరువాత ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవన్.
వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ- ‘వెంకటేష్ బాబు బంగారమే..
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ విడుదల తేదీ సెప్టెంబర్ 2కు వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటల వేడుకను ఆగస్టు 15న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ ఆ రోజు కాకుంటే 14నే విడుదల చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు హైదరాబాద్లో విడుదలచేసి..
ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్బాబు మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ను ఆగస్టు 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులకు కానుకగా ప్రీ లుక్ ప్లాన్ చేశారట.
డబ్బింగ్ సీరియల్స్పై తెలుగు టెలివిజన్ యూనియన్ సీరియస్ అయింది. తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలను రోడ్డున పడేసేలా డబ్బింగ్ సీరియల్స్ దండయాత్ర చేస్తున్నాయని తెలుగు టెలివిజన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్బింగ్ సీరియల్స్ను అడ్డుకునేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యామని తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ప్రకటించింది.