S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా మోహన్లాల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం జనతా గ్యారేజ్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో ఇంటర్వ్యూ..
అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు.. టెన్షన్గా లేదా?
వజ్రా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.్ఫలిమ్స్ పతాకాలపై సుధాకర్ అండ్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న 9/ఎ కృష్ణలంక చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్నివ్వగా తెలంగాణా మంత్రి చందూలాల్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ, టెర్రరిజం నేపధ్యంలో సాగే కథ ఇదని, దాంతోపాటు మంచి ప్రేమకథ కూడా ఉంటుందన్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్ కథానాయకుడుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న ‘శతమానం భవతి’ షూటింగ్ ప్రారంభమైంది. సత్యరంగయ్య క్లాప్ ఇవ్వగా యశ్వంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, ఈ కథ మూడు తరాలకు సంబంధించినదని, సెప్టెంబర్ 14నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదివరకే రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ పెళ్లిచూపులు సినిమాతో దక్కించుకుంది అందాల భామ రీతూవర్మ. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిన్న చిత్రంగా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో రీతూవర్మకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు ఎవరినోట విన్నా రీతూవర్మ పేరే వినిపిస్తోంది. ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ప్రతీక్, శ్రావ్య జంటగా రాహుల్ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్కరణ్ దర్శకత్వంలో లంక కరుణాకర్దాస్ రూపొందించిన చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత కరుణాకర్దాస్ మాట్లాడుతూ, ఇదొక వెరైటీ ప్రేమకథనంతో రూపొందించిన చిత్రమని, సినిమా పేరుకు తగ్గట్టుగానే అందంగా,సప్తవర్ణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
అందాల భామ త్రిష ఇటీవలే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమెకు మంచి ఛాన్స్లే దక్కినా మంచి సక్సెస్ మాత్రం చేరువ కాలేదు. హారర్ నేపథ్యంలో వచ్చిన నాయకి సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న త్రిషకు ఆ సినిమా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ గ్లామర్ డోస్ పెంచేందుకు జిమ్లో కుస్తీలు పడుతోంది.
శ్రీరామ్, మహేంద్ర, ప్రియానాయుడు హీరోహీరోయిన్లుగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.మోహన్రావు దర్శకత్వంలో రమేష్ భగవత్ నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. ఈ చిత్రం షూటింగ్ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్నివ్వగా మరో నిర్మాత రామసత్యనారాయణ స్విచ్ ఆన్ చేశారు.
చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో చిరు తనయుడు రామ్చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెట్స్పై ఉండగానే మెగాస్టార్ తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయని తెలుస్తోంది.
సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రారంభమైంది. ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా టు కంట్రీస్ చిత్రానికి ఇది రీమేక్. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా సాంగ్ రికార్డింగ్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో సునీల్ మాట్లాడారు.
గ్యాంగ్స్టర్ నరుూమ్తో తెలుగు సినీరంగానికి చెందిన పలువురు నిర్మాతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన నట్టికుమార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నట్టికుమార్ ఆరోపణలపై నిర్మాత సి.కళ్యాణ్ శుక్రవారం స్పందించారు. ఈ విషయంపై నిర్మాతల మండలి చాలా సీరియస్గా ఉందని, నిరాధార ఆరోపణలు చేసి పబ్లిసిటీ తెచ్చుకోవడమే అతని నైజం అని అన్నారు.