S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, బాలురెడ్డి, షేక్ షిరాజ్ రూపొందిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, హీరో కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైందని, మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు.
మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై శే్వతామీనన్ ప్రధాన పాత్రలో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్రావు రూపొందిస్తున్న చిత్రం షీ (ఈజ్ వెయిటింగ్). ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఒక అందమైన ప్రేమకథతో హారర్ను జోడించి, రూపొందించిన ఈ చిత్రం సరికొత్త జోనర్లో ఉంటుందని, శే్వతామీనన్ పాత్ర హైలెట్గా ఉంటుందని, షీ అంటే ఆమె ఎవరు?
ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కరుణాకరన్కు ఈమధ్య సరైన హిట్స్ లేవు. చేసిన సినిమాలు బాక్స్ఆఫీసువద్ద బోల్తా కొడుతుండడంతో కెరీర్ డీలాపడింది. ప్రేమకథలను బాగా డీల్ చేయగల ఈ దర్శకుడు ఈసారి హ్యాట్రిక్ హీరోను పట్టేసాడు. అతడెవరో కాదు శర్వానంద్. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని, కథతోపాటు స్క్రిప్ట్ కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది.
నితిన్, సమంత జంటగా హారిక అం డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ రూపొందిస్తున్న ‘అ.. ఆ’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ను నిన్న సాయంత్రం పూర్తిచేశారు. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తున్నారని నితిన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.
శ్రీ ఓండి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శ్బాబు, పావని జంటగా అజ్మీరాచంద్ దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం నాన్న నేను వర్ష. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు.
పరిశ్రమలో కాంబినేషన్ల క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఒక కాంబినేషన్ హిట్ అయితే, ఆ కాంబినేషన్లు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే వుంటాయి. తాజాగా మెగా హీరోల హీరోయిన్గా మారిన రకుల్ప్రీత్సింగ్, వరుసగా వారి సినిమాల్లోనే చేస్తూ అవకాశాలు పట్టేస్తోంది. ఇప్పటికే చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్తేజ్లతో నటించిన రకుల్, బ్రూస్లీ అపజయంతో కాస్త డీలాపడినా ‘సరైనోడు’ సినిమాతో మంచి హిట్ను కొట్టింది.
సాయిధరమ్తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వినీత్, మోనికాసింగ్ జంటగా వి2 ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్మోహన్.సిహెచ్. దర్శకత్వంలో అశోక్ గోటి రూపొందించిన చిత్రం ‘పిడుగు’. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి. ఎస్. సాయి కృష్ణారెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు.
రాజ్కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో పి.రాజశేఖరరెడ్డి రూ పొందించిన చిత్రం ‘రుద్ర ఐ.పి. ఎస్.’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.