S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ గ్లామర్ భామగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది రెజీనా. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈమె, మరో సినిమాలో నటించేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తోంది. దానికి కారణం
క్రియేటివ్ దర్శకునిగా ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ
వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బాబు బంగారం’. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ పోలీసు అధికారిగా వినోదాత్మకమైన పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళుతున్నారు.
రామకృష్ణ, బింధు బార్బి జంటగా హార్డ్వర్క్ ప్రొడక్షన్స్ పతాకంపై షెరాజ్ దర్శకత్వంలో రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘దమ్ముంటే రా’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కేవలం 24 రోజుల్లోనే పూర్తిచేశామని అన్నారు.
‘పెన్సిల్’ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని, ఈ చిత్రంతో హీరోగా తెలుగు లో గుర్తింపు వస్తుందని అనుకుంటున్నానని హీరో జి.వి.ప్రకాష్ తెలిపారు. సంగీత దర్శకుడిగా పలు చిత్రాలకు అందరూ మెచ్చే బాణీలను అందించిన జి.వి.ప్రకాష్ కథానాయకుడిగా రూపొందిన ‘పెన్సిల్’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన పలు విషయాలను తెలిపారు.
కేన్స్కు చిత్రోత్సవ కళ వచ్చేసింది. హాలీవుడ్ సహా వివిధ దేశాలకు చెందిన తారలు, మోడల్స్, సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. గురువారం రాత్రి అట్టహాసంగా 69వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా కేఫె సొసైటీ ఆధ్వర్యంలో రెడ్కార్పెట్ హంగామా అలరించింది. పేరుమోసిన సెలబ్రిటీలు, జ్యూరీ సభ్యులు తమ అందచందాలతో రెడ్కార్పెట్పై హొయలొలికించారు.
మెగా హీరో నాగేంద్రబాబు కుమార్తె నిహారిక కథానాయికగా, నాగశౌర్య హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.
అశోక్ రాయల్, అవంతిక, కీర్తిక ప్రధాన తారాగణంగా సాయి సింధూ క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సిందూర’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగింది. హీరో హీరోయిన్లపై కనకమామిడి స్వామిగౌడ్ క్లాప్నివ్వగా, మామిడి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు.
24
దర్శకుడు విక్రం కె.కుమార్
‘13బి’, ‘ఇష్క్’, ‘మనం’ వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు విక్రం కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. మే 6న వరల్డ్ వైడ్గా ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర దర్శకుడు విక్రం కె.కుమార్తో ఇంటర్వ్యూ...
మహేష్బాబు
కథానాయకుడిగా నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం విడుదల చేశారు. ఇందులో మహేష్బాబుతోపాటు కథానాయిక సమంత కూడా వున్నారు