S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిరంజీవి కోడలు రామ్చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పటివరకూ రామ్చరణ్ భార్యగానే తెలిసిన ఆమె టీవిలో యాడ్స్లో నటిస్తుండడం విశేషం. అపోలో హాస్పిటల్స్ లైఫ్ విభాగానికి డైరెక్టర్ అయిన ఆమె బి పాజిటివ్ అనే పత్రికను కూడా నడుపుతున్నారు. అపోలో లైఫ్ తయారుచేసే రకరకాల ప్రొడక్ట్లకు సంబంధించిన యాడ్ టీవిలో వస్తోంది.
సూపర్స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించారు. మహేష్తో ఇప్పటికే ‘బిజినెస్మెన్’ సినిమా చేసిన కాజల్, మళ్లీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించడం సంతోషంగా వుందని అంటోంది. ఆమెతో ఇంటర్వ్యూ విశేషాలు...
దిల్ రాజు సినిమాలంటే ముఖ్యం గా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆసక్తి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు నిర్మిస్తారన్న పేరున్న ఆయన లేటెస్టుగా తీసిన సినిమా ‘సుప్రీమ్’. సాయిధరమ్తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దిల్రాజు చెప్పిన విశేషాలు...
రెస్పాన్స్ అదిరింది
రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పడు ‘కబాలి’ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన టీజర్తో రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు జూలై వరకు ఇలా ఎదురుచూస్తూనే వుండాలి. అయితే ఈలోగా అభిమానుల్లో ఉత్సాహాన్ని అలాగే కొనసాగించేందుకు నెలన్నర పాటు ప్రమోషన్స్తో ‘కబాలి’ టీమ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్మన్’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ‘అష్టాచమ్మ’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మలయాళంలో విజయవంతమైన ఉస్తాద్హోటల్ చిత్రాన్ని తెలుగులో జతగా అనే పేరుతో అనువదిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జతగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రషీద్ అన్వర్, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మలయాళంలో మ్యూజికల్ హిట్గా నిలిచిన ఈ చిత్రంలో కథాకథనాలు సరికొత్తగా ఉంటాయని, ముఖ్యంగా దుల్కర్, నిత్యామీనన్ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందిస్తున్న చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ఆడియోను ఎం.ఎస్.రాజు, పాశం యాదగిరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిగ్ సీడీని విడుదల చేశారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ ఓ మెరుపు మెరిసింది. అందమైన దుస్తుల్లో మెరిసిపోయింది. కువైట్కు చెందిన ప్రఖ్యాత డిజైనర్ అలి యూనిస్ రూపొందించిన దుస్తులు ధరించిన ఐష్ రెడ్కార్పెట్పై హొయలుపోతూ నడుస్తూంటే ఆహూతులు కళ్లార్పకుండా చూస్తూండిపోయారు. బంగారువర్ణంతో ఉన్న పొడవైన గౌను ధరించిన ఐష్ను చూడటానికి మీడియా తహతహలాడింది.
ప్రభుదేవ, తమన్నా, అమీ జాక్సన్ ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పరిచయ పాట ఆర్ఎఫ్సిలో భారీ సెట్టింగులమధ్య చిత్రీకరణ జరుగుతోంది.
ప్రపంచ సినీ సంబరం కేన్స్ ఫిలిమ్ఫెస్టివల్కు బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్, సోనమ్కపూర్ ఈసారికూడా హాజరవుతున్నారు. ఇప్పటికే సోనమ్ కేన్స్ చేరుకోగా ఐశ్వర్యరాయ్ గురువారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన కుమార్తె ఆరాధ్య, తల్లి బృందతో కలసి ఆమె వెళ్లారు. కాగా ఐశ్వర్యరాయ్ ఇప్పటివరకు వరుసగా 15 సంత్సరాలుగా కేన్స్ చిత్రోత్సవానికి వెళ్లడం, రెడ్కార్పెట్పై హొయలొలికిస్తూనే ఉన్నారు.