S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/06/2020 - 02:48

జీడిమెట్ల, మార్చి 5: ఆటో కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దూలపల్లి గ్రామంలో నివాసముండే శ్రావణ్ కుమార్, వినిత దంపతులు. కిరాణ దుకాణాలకు సరుకులను పంపిణీ చేసే పనులు చేస్తారు. వీరి పాప 15 నెలల వయస్సు కలిగిన ఆరాధ్య. పాప మేనమామ హన్మంతు ఆటోను తీస్తుండగా వెనుక ఉన్న పాప ఆరాధ్య ఆటో కింద పడి మృతి చెందింది.

03/06/2020 - 02:47

కొత్తూరు, మార్చి 5: రోడ్డు ప్రమాదంలో జనారణ్యంలోకి వచ్చిన దుప్పి మృతి చెందింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం 44వ జాతీయ రహదారి బైపాస్ ఎంఎస్‌ఎన్ పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వాహనం రోడ్డు దాటుతున్న దుప్పిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. విషయాన్ని కమ్మదనం ఆటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ రవీందర్‌కు సమాచారం ఇచ్చారు.

03/06/2020 - 02:11

హైదరాబాద్, మార్చి 5: కరోనా వైరస్ నివారణలో అధికారుల పనితీరుపై రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా నివారణకు తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించినపుడు న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిపై దాఖలైన ప్రజావాజ్య పిటిషన్‌పై గురువారం నాడు విచారణ కొనసాగింది.

03/06/2020 - 07:05

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గురువారం పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ‘శబరిమల కేసుల్లో వాదనలు పూర్తయిన తరువాతే సీఏఏ పిటిషన్లు విచారిస్తాం’ అని వెల్లడించింది.

03/06/2020 - 01:05

న్యూఢిల్లీ, మార్చి 5: సీఏఏ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అల్లర్ల బాధితుడి జోక్యంను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారని అభియోగం. మందర్ కేసులో బాధితుల తరఫున తన వాదనలు వినిపించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సాల్వేస్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

03/06/2020 - 00:48

న్యూడిల్లీ, మార్చి 5: నలుగురు నిర్భయ దోషులను మార్చి 20 తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి తీస్తారు. ఢిల్లీ పటియాలా సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి ధరేంద్ర రాణా గురువారం తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. నిర్భయ దోషులు నలుగురికి సంబంధించిన పిటిషన్లు ఏ కోర్టులో కూడా పెండింగ్‌లో లేనందున తాజా డెత్ వారెంట్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు.

03/05/2020 - 06:00

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున హోలీ సంబరాలను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన ప్రజావాజ్యపిటిషన్‌ను న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది.

03/05/2020 - 06:31

యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున కారు కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం జిల్లాలోని యలమంచిలి మండలం కాజ తూర్పు గ్రామానికి చెందిన కొప్పినీడి సురేష్ (22), అతని బావమరిది, చౌదరి కాశీ (22), చింతా చిట్టియ్య (45) రొయ్య సీడ్ కొనుగోలు నిమిత్తం మంగళవారం కారులో తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వెళ్ళారు.

03/05/2020 - 05:30

న్యూఢిల్లీ, మార్చి 4: ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో మృతి చెందిన సంఘటనలో ఈ కేసులో ప్రథమ ముద్దాయి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పాత్ర ఉన్నట్టు కనిపిస్తోందని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నావో బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సెంగార్, మరో ఏడుగురు తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేయించినట్టు కోర్టు అనుమానం వ్యక్తం చేసింది.

03/05/2020 - 05:25

న్యూఢిల్లీ, మార్చి 4: సీఏఏ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సామాజిక కార్యకర్త హర్ష్ మణ్‌దీర్‌కు సుప్రీం కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆందోళనకారులను మండేర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నది అభియోగం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం కాలమిస్టు మండేర్‌ను వివరణ కోరింది.

Pages