S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/20/2018 - 04:00

పెదనందిపాడు, ఏప్రిల్ 19: పెదనందిపాడు మండలం పాలపర్రులో బుధవారం రాత్రి సోమేశ్వర, సూర్యేశ్వర స్వామి దేవస్థానాల్లో దొంగలుపడ్డారు. సూర్యేశ్వర, సోమేశ్వర, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలను అపహరించుకెళ్లారు. ఈ విషయం తెలియడంతో ఎస్‌ఐ దేవాలయాన్ని పరిశీలించారు. అర్చకులు నూతలపాటి సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గురువారం దర్యాప్తు ప్రారంభించారు.

04/20/2018 - 02:05

హైదరాబాద్, ఏప్రిల్ 19: పిటిషన్‌లో గవర్నర్ పేరును చేర్చాలా వద్దా అనే అంశంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. రెం డు పిటిషన్లలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరును ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు.

04/20/2018 - 01:48

హైదరాబాద్, ఏప్రిల్ 19: మహబూబ్‌నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె.రంగారావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయమే ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయ స్థానం జడ్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అరగంటకే హైకోర్టు నుండి ఈ ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా మహబూబ్‌నగర్ కోర్టుకు సమాచారం అందిం ది. దీంతో రంగారావు విధుల నుండి తప్పుకున్నారు.

04/20/2018 - 02:58

న్యూఢిల్లీ: సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బి.హెచ్.లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను అపఖ్యాతి పాలు చేయడానికి పిటిషనర్లు తీవ్రంగా యత్నించారని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. లోయా, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్నారు. కాగా నాగ్‌పూర్‌లో తన స్నేహితుడి కుమార్తె వివాహానికి హాజరై వస్తుండగా గుండెపోటుతో 2014, డిసెంబర్ 1న అకస్మాత్తుగా మరణించారు.

04/20/2018 - 01:11

ఉలవపాడు, ఏప్రిల్ 19 : గత మూడురోజుల నుంచి వీస్తున్న వడగాలులతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉలవపాడు రిజర్వుకాలనీకి చెందిన బుడేసాహెబ్ (72) మంగళవారం సపోట కోతలకు వెళ్లి కాయలు కోస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే వైద్యశాలకు తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

04/20/2018 - 00:16

సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 19: సిద్ధిపేట జిల్లా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.రవికాంత్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలను, బాలికల ఉన్నత పాఠశాలను, ఇందిరనగర్ ఉన్నత పాఠశాలను,ప్రభుత్వ ఉన్నతపాఠశాలను ఆయన అకస్మీకంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్లడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు.

04/20/2018 - 00:09

శివ్వంపేట, ఏప్రిల్ 19: ఉపాధి హామీ నిబంధనల ప్రకారం వేసవిలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓ ఉపాధి కూలీ వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో చోటు చేసుకుంది. స్థానిక పంబాల యాదగిరి(48) ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా గూడూర్ పనులు చేస్తున్న క్రమంలో వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు కేసు దర్యాప్తులో ఉంది.

04/18/2018 - 03:13

బనగానపల్లె, ఏప్రిల్ 17: కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. బనగానపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో మంగళవారం ఉదయం ఆటో అదుపుతప్పి కుడివైపు వెళ్లడంతో అదే మార్గంలో వచ్చిన లారీ ఢీకొంది.

04/18/2018 - 03:12

పిఠాపురం, ఏప్రిల్ 17: పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న బిల్లు కలెక్టర్ జి నాగరాజు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వీధిలో నివసిస్తున్న గొల్లపల్లి కన్నయ్య ఇటీవల ఒక ఇంటిని కొనుగోలుచేశారు. ఇంటి పన్ను తన పేరిట మార్పు నిమిత్తం మున్సిపల్ కార్యాలయంలో బిల్లు కలెక్టర్ నాగరాజును సంప్రదించారు.

04/18/2018 - 02:18

చేవెళ్ల, ఏప్రిల్ 17: కారు మోటర్ సైకిల్ ఎదురు రెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండ పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages