S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/22/2018 - 03:35

మాచర్ల రూరల్, ఏప్రిల్ 21: నిద్రపోతున్న కన్న కొడుకులను ఓ కసాయి తండ్రి పాశవికంగా హతమార్చి పరారైన సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణ శివారులో శనివారం జరిగింది. మాచర్ల నియోజక వర్గంలోని వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడుకు చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి కొన్ని సంవత్సరాల కిందట మాచర్లకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

04/22/2018 - 04:35

గూడూరు టౌన్: నెల్లూరు జిల్లా గూడూరు శివారు చెన్నూరులో ఓ మానవమృగం ముక్కుపచ్చలారని ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

04/22/2018 - 03:00

నిజామాబాద్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8మంది బుకీలను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి వద్ద నుండి 3లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పుణె నగరానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు.

04/22/2018 - 02:34

తిరుపతి, ఏప్రిల్ 21: తిరుపతిలోని కెనె్సస్ హోటల్లో బస చేసిన స్వీడన్ దేశానికి చెందిన హెడెలాండ్ రోల్ఫ్ ల్యాంపర్ట్ విల్లే (58) శనివారం మృతి చెంది ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాళహస్తి లోని గ్రీన్‌ప్లై సంస్థకు అవసరమైన యంత్రాలను అమర్చడానికి స్వీడన్ దేశం నుంచి 10 మంది బృందం శుక్రవారం తిరుపతికి చేరుకుంది.

04/21/2018 - 04:15

సాలూరు, ఏప్రిల్ 20: పట్టణంలోని రైసుమిల్లుపై శుక్రవారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె కృషన్ ఆధ్వర్యంలో అధికారులు డబ్బీవీధిలోని బొడ్డెపు వెంకటలక్ష్మి మోడ్రన్ రైసుమిల్లులో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.

04/21/2018 - 03:35

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 20: బస్టాండుకు వెళ్లేందుకు ఎక్కిన ప్రయాణికురాలి బ్యాగ్‌తో ఓ ఆటోడ్రైవర్ ఉడాయించాడు. కొన్ని గంటలలోనే పోలీసులు సీసీ కెమేరా ఫుటేజీ ద్వారా నిందితుని గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.60 వేలు విలువ చేసే 30 గ్రాముల బంగారం, రెండు చీరెలు స్వాధీనం చేసుకున్నారు.

04/21/2018 - 03:30

చింతూరు, ఏప్రిల్ 20: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి వారాంతపు సంతలో శుక్రవారం పోలీసులు ఆరుగురు మావోయిస్టులను అరెస్టుచేశారు. అయితే ఈసందర్భంగా పారిపోతున్న ఒక మావోయిస్టును పోలీసులు వెంబడించగా, అతడు వారిపై కాల్పులు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. వివరాలిలావున్నాయి...

04/21/2018 - 03:30

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 20: రాష్ట్రంలో అతి పెద్ద ఆయిల్ మాఫియా గట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ), ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు మూడు లక్షల 15వేల లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. ఆయిల్ మాఫియాముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు.

04/21/2018 - 03:29

కాకినాడ సిటీ, ఏప్రిల్ 20: ఇద్దరు మావోయిస్ట్ దళ డిప్యూటీ కమాండర్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

04/21/2018 - 02:50

లక్నో, ఏప్రిల్ 20: మైనర్లపై సామూహిక అత్యాచారాల ఘటనలకు నిరసనగా దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహవేడుకకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం యూపీలో కలకలం రేపింది. ఉన్నావ్, కథువ ఘటనలు మరిచపోకముందే బీజేపీ పాలిత యూపీలోని అలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కెల్తాలో మైనర్ రేప్‌కు గురైంది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు ఆమెను చంపేశాడు.

Pages