-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మద్దిరాల, మే 25: వేసవి సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతైన సంఘటన నూతన్కల్ మండలంలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది.
మిర్యాలగూడ టౌన్, మే 25: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన 45 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం నాడు రైల్వే మజ్దూర్లు గుర్తించి రైల్వే పోలీసులకు తెలిపారు. వెంటనే రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు కాని వివరాలు కాని లేవని పోలీసులు తెలిపారు.
బోయినిపల్లి, మే 25: అన్నదమ్ముల మధ్య భూ వివాదం కాస్త ప్రాణం తీసింది. శుక్రవారం అన్న ఫిర్యాదుమేరకు పోలీసులు తమ్మున్ని పిలిపించగా భయంతో పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీపతి ఆదినారాయణ (70), అతని సోదరునికి మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అతని సోదరుడు ఆదినారాయణ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
సంతమాగులూరు మే 25: సంతమాగులూరు మండలం మామిళ్లపల్లిలో ఒక యవకుని అగంతకులు కిడ్నాప్ చేశారనే వార్త కలకలం రేపింది. కిడ్నార్ల చెరనుండి కొద్ది గంటల్లోనే యువకుడు తప్పించుకు వచ్చానని లేకుంటే తనను వారు ఏమిచేసేవారోననే ఆందోళనను బాధితుడు వ్యక్తపరుస్తున్నాడు.కొమ్మాలపాడు వద్ద బుధవారం కిడ్నాప్ జరినట్లు తెలుపుతున్న ఈ కిడ్నాప్ కథనం శుక్రవారం వెలుగు చూసింది.
సూళ్లూరుపేట, మే 25: సూళ్లూరుపేట పట్టణంలోని హోలిక్రాస్ కూడలి సమీపంలో శుక్రవారం రెండు బస్సులు ఢీకొన్న సంఘటన చోటుచేసుకొంది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రయివేట్ బస్సు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తమిళ బస్సు వెనుక భాగం అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. అంతేకాకుండా వెనుక కొంత భాగం బస్సు దెబ్బతినింది. ఇందులో ప్రయాణికులుకు మాత్రం ఎటువంటి గాయాలు తగలకుపోవడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.
సూళ్లూరుపేట, మే 25: షార్ కాలనీ అయిన పులికాట్ నగర్ (డీఆర్డీఎల్)లో మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి వినూత్నరీతిలో చోరీలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ స్టౌ వెలిగించి దానిపై ఏదైన గుడ్డను తగలపెట్టి వెళ్తున్నాడు. వరుసగా మూడు రోజులు మూడు ఇళ్లల్లో ఇదేవిధంగా జరగడంతో ఆ కాలనీలో నివాసం ఉంటున్న షార్ ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
ఏలూరు, మే 25 : రైతులను నమ్మించి మొక్కజొన్న తీసుకువెళ్లి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో టుటౌన్ పోలీసులు హైదరాబాద్కు చెందిన మన్నం వెంకట కృష్ణారావుపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
కర్నూలు, మే 25: నగర శివార్లలోని సుంకేసులో రోడ్డు మాసమసీదు దగ్గర వైన్షాపు దగ్గర చాకలి రాముడు (38)ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మద్యం మత్తులో మాటమాటల్లో ఘర్షణ పడి చివరకు హత్యకు దారితీసింది. మృతుడు నగరంలోని ధర్మాపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం.
గూడూరు, మే 25: మండలంలోని చనుగొండ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన విద్యుదాఘాతానికి రైతు నడిపి మాదన్న (50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నడిపి మాదన్న తనకు ఉన్న పొలంలో మిరప పంటను సాగు చేశాడు. ఉదయం మెరప పంటకు నీటి పెట్టడానికి వెళ్లాడు. ఇదే పొలం పక్కన మరో రైతు మోహన్ పొలంలో విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. కింద పడ్డ తీగలను నడిపి మాదన్న చూసుకోక కాలు పెట్టగా కరెంటు షాక్కు గురయ్యాడు.
మంగళగిరి, మే 25: మండల పరిధిలోని కురగల్లు - నీరుకొండ గ్రామాల మధ్య నిర్మాణం పనులకు సంబంధించిన సెంట్రింగ్ సామగ్రిని లారీలో తరలిస్తుండగా లారీ క్యాబిన్ విరిగి పడటంతో అందులో ఉన్న క్లీనర్ సయ్యద్ హుస్సేన్ (20) దుర్మరణం పాలయ్యాడు. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన వివరాలను రూరల్ పోలీసులు వెల్లడించారు.