S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/17/2018 - 22:34

సత్తెనపల్లి, జూలై 17: సత్తెనపల్లి మండల పరిధిలోని పాకాలపాడు గ్రామానికి వెళ్లు ప్రధాన రహదారిలోవున్న రెండవ వంతెన సమీపంలో అడ్డుగా వచ్చిన బైకును ఢీకొన్న బైకు చోదకుడు అక్కడికక్కడే మృతి చెందగా వేరొక బైక్‌పైవున్న వ్యక్తికి కాలువిరిగి తీగ్రగాయాల పాలైనాడు.

07/17/2018 - 22:17

బనగానపల్లె, జూలై 17:నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో అదే గ్రామానికి చెందిన బొల్లి పెద్దనాగరాజు(52) దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు..

07/17/2018 - 00:44

గచ్చిబౌలి, జూలై 16: రైలులో వస్తారు.. జన సంచారం లేని ప్రాంతాల్లో పగలు రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనం చేసుకుని వెళ్లి పోతారు. సీసీఎస్, బాలనగర్, మాదాపూర్ పోలీసులు కరుడుగట్టిన ఆరుగురు ఘరాన దొంగలను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మహారాష్టక్రు చెందిన, మరో ముగ్గురు ఏపీకి చెందినవారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.

07/17/2018 - 00:21

పెద్దపల్లి, జూలై 16: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్ నంబర్ 2 లో ఉంటున్న 8,9వ తరగతులు చదువుకుంటున్న విద్యార్థులపై శుక్రవారం గుర్తు తెలియని విద్యార్థులు హాస్టల్లో చొరబడి దాడికి పాల్పడ్డారని ఈవిషయంపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

07/17/2018 - 00:05

కాజులూరు, జూలై 16: ఒక స్కూలు బస్సు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడటంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బస్సులో విద్యార్థులు బయటపడ్డారు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాజులూరు మండలం గొల్లపాలెంలో గల టిఎస్‌ఎన్ మూర్తి కళాశాలకు చెందిన స్కూలు బస్సు సాయంత్రం స్కూలు ముగియడంతో గొల్లపాలెం నుండి మండలానికి చెందిన చేదువాడ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

07/16/2018 - 23:55

జగ్గయ్యపేట రూరల్, జూలై 16: ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ మండల పరిధిలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమంచిపల్లి వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక వాహనంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 60 బ్యాగ్‌ల బియ్యంను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

07/16/2018 - 23:53

విజయవాడ (క్రైం)/ రైల్వేస్టేషన్, జూలై 16: సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ కక్షలను పురస్కరించుకుని స్వయానా బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కుంకుడుమల్లి గ్రామానికి చెందిన చదలవాడ రాజు(33) రైల్వేలో గేట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన సోదరి భర్త అయిన కె శేఖర్ కూడా విజయవాడలో రైల్వే ఉద్యోగి.

07/16/2018 - 23:46

సిరిసిల్ల, జూలై 15: సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు ప్యాసింజర్ ఆటో బోల్తా పడి 11 మంది గాయాలపాలయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్ ప్రాంతానికి చెందిన జక్కని మల్లేశం కుటుంబం మొక్కు తీర్చుకోవడానికి, అలాగే చిన్నారి 21వ రోజు ఎల్లమ్మ ఆలయం వద్ద జరుపుకోడాకి తంగళ్ళపల్లి మండలం మండెపల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళుతుండగా ఆదివారం ఈ ఘటన జరిగింది.

07/16/2018 - 23:20

చోడవరం, జూలై 16: ఎక్సైజ్ పోలీస్ అధికారులు రూట్ వాక్ చేస్తుండగా రెండులక్షల విలువ చేసే 40కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా నింధితుడు పట్టుబడ్డ వైనం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని బుచ్చెయ్యపేట మండలం రాజాం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ సిఐ ఈశ్వరరావు అందజేసిన వివరాలిలావున్నాయి.

07/16/2018 - 23:15

కదిరి రూరల్, జూలై 16: కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంలో నివాసముంటున్న మహమ్మద్ హనీఫ్ కుమారుడు హసేన్‌బాషా (22) సోమవారం కర్నాటక రాష్ట్రం బిళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హుసేన్‌బాషా చెల్లె అయిన యాష్మిన్‌ను బిళ్లూరుకు చెందిన ఓ అబ్బాయితో వివాహం చేశారు.

Pages