S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/20/2018 - 22:33

భువనగిరి, జూలై 20: ఆటోలో భారీగా గుట్కాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు లక్షా 70వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, ఒక ఆటోను శుక్రవారం ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకొని భువనగిరి పోలీసులకు అప్పగించినట్లుగా ఎస్‌వోటీ సీఐ గంగాధర్ తెలిపారు.

07/20/2018 - 22:28

తెనాలి, జూలై 20: హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రెండవ పట్టణ పోలీసుల కథనం ప్రకారం 2018 ఏప్రిల్ 4వ తేదీ తెల్లవారుఝామున తెనాలి రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేట్రాక్‌పై గాయాలతో ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి జీఆర్‌పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేశారు.

07/20/2018 - 22:08

రాజాం, జూలై 20: రాజాం మండలం శ్యాంపురం సమీపంలో రంగప్పచెరువు గట్టుపై నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు తాడ్డి లలిత, యు.మురళీ అనే విద్యార్థులు గాయాలపాలయ్యారు.

07/20/2018 - 22:05

మందస, జూలై 20: మండలంలో కొర్రాయిగేటు సమీపంలో రైల్వే అభివృద్ధి పనులకు సంబంధించి ట్రాలీలారీ నుంచి సిమ్మెంట్ కమ్మిలను క్రేన్‌లతో దించుతుండగా డ్రైవర్ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం, రాయపూర్‌కు చెందిన జగ్‌వీత్‌సింగ్(30) జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సిమ్మెంట్ కమ్మిలు రైల్వేట్రాక్‌లు వద్ద వినియోగిస్తుంటారు. రైల్వేపోలీసులు, మందస పోలీసులు కేసు నమోదులో కొంత సమయం తీసుకున్నారు.

07/20/2018 - 00:28

శేరిలింగంపల్లి, జూలై 19: హెచ్‌సీయూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది అపార్టుమెంటు పైనుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడుపల్లికి చెందిన ఎస్.హర్షిత (21) గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

07/20/2018 - 00:09

పాతబస్తీ, జూలై 19: భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో ఆడామగా అశ్లీల నృత్యాలు చేస్తున్నారని సమాచారం అందిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. 53 మంది పురుషులు, ఐదుగురు స్ర్తిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. నగర ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ హోటల్‌లో ఈ నృత్యాలు జరుగుతుండగా బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికదాడులు నిర్వహించి నిందితులందరినీ అరెస్ట్ చేశారు.

07/20/2018 - 00:06

కంకిపాడు,జూలై 19: తెనే్నరు పంటకాల్వలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమై న సంఘటన గురువారం చోటుచేసుకుంది . పొలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తెనే్నరు గ్రామశివారు పంటకాల్వలో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఎస్‌ఐ షరిఫ్, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాల్వలోని మృతదేహాన్ని బయటికి తీయించారు.

07/19/2018 - 23:21

నల్లమాడ, జూలై 19: ఎనే్నళ్లని నేను మీ కార్యాలయంకు తిరగాలి. నా భర్తకిచ్చిన భూమి నాకు చెల్లదా. నాకు మీరు న్యాయం చేయరులే.. నేనిక్కడే సచ్చిపోతానంటూ ఓ వృద్ధురాలు నల్లమాడ తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. మండలంలోని సానేవారిపల్లికి చెందిన చండ్రాయుడికి 1987లో 4.48 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది.

07/19/2018 - 23:21

అనంతపురం అర్బన్, జూలై 19: తపోవనంలోని సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఎరువుల గోడౌన్‌ను నిఘా మరియు అమలు విభాగం అధికారి రామాంజినేయులు ఆదేశాల మేరకు గురువారం అధికారులు దాడులు నిర్వహించారు.

07/19/2018 - 23:19

తాడిపత్రి, జూలై 19: స్థానిక పెన్నా నది వంతెనపై గురువారం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని శివశంకరరెడ్డి(35) మృతి చెందాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి ద్విచక్ర వాహనంలో తాడిపత్రికి వస్తుండగా పెన్నా వంతెనపై నాపరాయి లోడుతో ఆగి వున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందాడు.

Pages