S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/21/2018 - 22:56

పూతలపట్టు, జూలై 21: చిత్తూరు-నాయుడుపేట జాతీయ రహదారిలోని పూతలపట్టు మండలం ఒంటిళ్లు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న రెండు కార్లను ఎదురుగా వచ్చిన కంటైనరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కంటైనరు ఈ కార్లపై దూసుకెళ్లడంతో ఈ రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

07/21/2018 - 22:54

తిరుపతి, జూలై 21: తిరుమల పీఏసీ-2లో నెల్లూరుకి చెందిన భక్తుడు రూ.30వేలు విలువచేసే సెల్ ఫోన్లు, నగదు చోరీకి గురైన సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తిరుపతి విష్ణు నివాసంలో లాకర్లు తెరవడానికి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. ఈస్ట్ ఎస్‌ఐ దయాకర్ రెడ్డి కథనం మేరకు వివారాలు ఇలా ఉన్నాయి.

07/21/2018 - 22:47

కదిరి రూరల్, జూలై 21: కదిరి రూరల్ పరిధిలోని పంతలచెరువుకు చెందిన అరుణమ్మ (24) అనే వివాహిత కడుపునొప్పి తాళ లేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అంజినమ్మ పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. గత కొంతకాలంగా అరుణమ్మకు తీవ్ర కడుపునొప్పి ఉండేదని, ఆ నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది.

07/21/2018 - 22:00

నిజామాబాద్, జూలై 21: నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో శనివారం సాయంత్రం కత్తిపోట్ల సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు పథకం ప్ర కారం జరిపిన దాడిలో నవ యువకులైన సొంత అన్నదమ్ములు ఇద్దరు మృ త్యువాత పడ్డారు. తల్వార్‌లు, పదునైన కత్తులతో సుమారు పది మంది మూకుమ్మడిగా విరుచుకుపడి ఇరువురిని హతమార్చారు.

07/21/2018 - 00:16

వరంగల్ క్రైం, జూలై 20: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ సర్ట్ఫికెట్లను ఒర్జినల్ సర్ట్ఫికెట్లుగా నమ్మిం చి కోటి రూపాయలు వసూలు చేసిన ఏడుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

07/21/2018 - 00:16

చెన్నారావుపేట, జూలై 20: క్షణికవేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కన్న పేగే చివిరికి కాలయముడిగా మారాడు. చిన్న విషయంలో తలెత్తిన సమస్య తండ్రిని చంపే వరకు తీసుకవచ్చాడు ఒక తనయుడు. వివరాల్లోకి వేళ్తే బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపయ్యపేటకు చెందిన మెర్గు సంజీవ (55) పద్మల కుమారుడు నర్సయ్య హైదరాబాద్‌లో ఒ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

07/20/2018 - 23:55

రాజవొమ్మంగి, జూలై 20: రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెం సమీపంలో శుక్రవారం పోలీసులు రెండున్నర లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేశారు. సీఐ పి వెంకట త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం..

07/20/2018 - 23:26

పెబ్బేరు,జూలై 20: మండల కేంద్రంలో గత కొంత కాలంగా రైల్ మిల్లులే అడ్డగా ఏర్పచుకుని రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు.

07/20/2018 - 23:20

ఎల్లారెడ్డి, జూలై 20: చదివిన ఉన్నత చదవులకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, మనస్థాపం చెంది ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోశుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కుమార రాజ తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

07/20/2018 - 23:09

బెళుగుప్ప, జూలై 20 : మండల పరిధిలోని వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన రైతు చల్లా అశోక్ (28) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటాద్రిపల్లికి చెందిన చల్లా రంగనాయకులు కుమారుడు అశోక్ తనకున్న ఏడెకరాల పొలంలో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

Pages