S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/04/2020 - 02:20

శ్రీనగర్: నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తులో మంచి పురోగతిని సాధించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఈ ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తు ఇప్పటికే ముగింపు దశకు వచ్చినట్టు కనిపించింది. అయితే, ఎన్‌ఐఏ మంగళవారం నాడు ఈ కేసు దర్యాప్తులో గణనీయమయిన పురోగతిని సాధించింది.

03/03/2020 - 04:49

హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్ పోర్టల్‌లో ఎందుకు ఉంచడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లోగా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని లేకుంటే ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. పిటిషన్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖరరావు దాఖలు చేశారు. పిటిషన్‌పై గత ఆరు నెలల నుండి విచారణ జరుగుతున్నా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని శేఖరరావు వ్యాఖ్యానించారు.

03/03/2020 - 03:58

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడాన్ని సవాల్ చేస్తూ, కేసును రాజ్యాంగ ధర్మాసనంతో విచారణ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

03/03/2020 - 03:56

పూణె, మార్చి 2: మహారాష్ట్ర లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పూణెకు 85 కిలోమీటర్ల దూరంలోని రాయగఢ్ జిల్లాలో రోడ్డు పక్కన నిల్చున్న వారి మీదుగా ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఖొపొలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దస్తూరి గ్రామం వద్ద ముంబయి - పూణె పాత జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. ఖొపొలి పోలీసుల కథనం మేరకు..

03/04/2020 - 04:03

న్యూఢిల్లీ: ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసే రీతిలో బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, అభే వర్మలు రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలంటూ నమోదైన అభ్యర్థనలను ఈనెల 4న విచారించడానికి సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది.

03/03/2020 - 01:53

విజయవాడ (క్రైం), మార్చి 2: రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 కేసుల్లో సుమారు 5లక్షల 80వేల రూపాయల విలువైన 186 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, నగదు, మూడు మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ హర్షవర్థనరాజు వివరాలు వెల్లడించారు.

03/03/2020 - 01:41

జీడిమెట్ల, మార్చి 2: ఏటీఎం సెంటర్‌లో ఓ దుండగుడు చోరీకి యత్నించిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుందిగల్ ఏఎస్‌ఐ వేణుగోపాల్ పెట్రోలింగ్ వాహనంలో డ్రైవర్ బ్రహ్మయ్యతో కలిసి సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో సూరారంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

03/03/2020 - 01:39

వనస్థలిపురం, మార్చి 2: కుటుంబ కలహాలతో కారు డ్రైవర్ ప్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లోయపల్లి గ్రామానికి చెందిన పోలగోని నరేందర్ (37) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి భార్య పార్వతమ్మ, కుమారుడు శ్రీకర్‌లతో కలసి బీఎన్‌రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నాడు.

03/02/2020 - 05:21

భీమ్‌గల్, మార్చి 1: డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో నానమ్మను ఓ మనవడు హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మెండోరా గ్రామ పరిధిలో గల వడ్డెర కాలనీలో కొమిరి లక్ష్మి (62) అనే వృద్ధురాలిని డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆమె మనవడు గంగాధర్ కర్రతో తలపై గట్టిగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

03/02/2020 - 05:17

సూర్యాపేట, మార్చి 1: ఎదిగివచ్చిన కుమారుడు కుటుంబానికి చేయూతనందించాల్సి ఉండగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధిస్తుండడంతో వేధింపులు తాళలేక కొడుకును రోకలిబండతో తలపై మోది తండ్రి హతమార్చిన సంఘటన జిల్లాకేంద్రమైన సూర్యాపేటలో శనివారం అర్ధరాత్రి జరిగింది.

Pages