S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/20/2020 - 01:55

మచిలీపట్నం, మార్చి 19: ఎప్పుడూ కక్షిదారులతో కళకళలాడే జిల్లా కరోనా దెబ్బతో ప్రధాన న్యాయస్థానం గురువారం వెలవెలబోయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా జాఢ్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టుకుంది. ఎప్పుడు ఎక్కడ కరోనా కేసులు నమోదవుతాయో తెలియక ప్రభుత్వం సతమతమవుతున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది.

03/20/2020 - 01:54

ఉయ్యూరు, మార్చి 19: స్థానిక కాలేజీ రోడ్డులో గురువారం గ్యాస్ లీకేజి వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలికి గాయా లైనాయి. సాయికృష్ణా హోం ఫుడ్స్ అండ్ కర్రీస్ పాయింట్ నందు పిండి వంటలు తయారు చేస్తుండగా పైపు అంటుకుని గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో వంట చేస్తున్న సీతమ్మ(62)కు గాయాలైనాయి.

03/20/2020 - 01:41

నేరేడ్‌మెట్, మార్చి 19: క్రికెట్ అడుతుండగా బంతి వచ్చి ఇంట్లో పడిందని కోపానికి గురైన ఇంటి యజమాని బాలుడిని చితకబాదిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ ఆర్‌కెపురంలో నివసించే జయబాబు కుమారుడు ధాత్రియన్ తన స్నేహితులతో కలసి ఇంటి వద్ద క్రికెట్ అడుకుంటుండగా బంతి వెళ్లి పక్కనే నివాసం ఉంటున్న అమరేందర్ సింగ్ ఇంట్లో పడినట్టు పోలీసులు తెలిపారు.

03/20/2020 - 01:38

ఖైరతాబాద్, మార్చి 19: వ్యక్తిగత కారణాలతో సీఆర్‌పీ ఎఫ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవాని శంకర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. సెలవులపై స్వంత ఊరికి వెళ్లిన శంకర్ గత పదిరోజుల క్రితమే డ్యూటీలో చేరారు. గురువారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఊరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

03/20/2020 - 01:34

సనత్‌నగర్, మార్చి 19: ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన డ్రెస్‌లను సప్లై చేస్తామని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యా సంస్థ తమ పాఠశాలల చదువుకునే విద్యార్థులకు డ్రెస్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం పలువురు యాజమాన్యాన్ని సంప్రదించారు.

03/19/2020 - 06:11

న్యూఢిల్లీ, మార్చి 18: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ విద్యావేత్త మధు పూర్ణిమా కిష్వార్ బుధవారం సుప్రీం కోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలు చేశారు. రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వలన న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని అమె తమ ‘పిల్’లో వాదించారు.

03/19/2020 - 05:36

సిద్దిపేట, మార్చి 18 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏకే 47, కార్బన్ తుపాకుల మాయం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసు అధికారులు వేటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనవరి 6న రాత్రి దేవిని సదానందం అనే వ్యక్తికి పొరుగున ఉన్న గుంటి గంగరాజుతో గోడ విషయమై వివాదం చెలరేగింది.

03/19/2020 - 04:59

విజయవాడ పశ్చిమ, మార్చి 18: అందరి జాతకాలు చెబుతానని, తలరాతలు మారుస్తానని మాయమాటలతో బురిడీ కొట్టించిన జ్యోతిష్యుడు అచ్చిరెడ్డి జాతకం మారిపోయింది. అతనిపై భవానీపురం పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. దోషాలు వదిలిస్తా, దంపతుల మధ్య మనస్పర్థలు మటు మాయం చేస్తా, అసలు నీ జాతకమే మార్చేస్తా నా చేతిలో మంచి సినీ డైరెక్టరులున్నారు.

03/19/2020 - 04:50

కొందుర్గు, మార్చి 18: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి చెందాడు. జిల్లేడు చౌదరిగూడ ఏఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్ కథనం ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన మచ్చ చంద్రయ్య (33) అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురు యువకులు బంధువుల ఇంటికి చౌదరిగూడకు మంగళవారం సాయంత్రం వచ్చినట్లు వివరించారు.

03/19/2020 - 04:40

షాబాద్, మార్చి 18: మహిళ హత్య కేసును చేధించేందుకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని తంగడ్‌పల్లి గ్రామ పరిధిలోని చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. మృతి చేందిన మహిళ 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Pages