వీరాజీయం

ఇవాన్ కా వచ్చే ఆ వంక.. అంతరిక్ష రైలు ఈ వంకా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదు ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్ ‘‘హెచ్‌ఐసిసి’’కి అలాగే హెచ్‌ఎమ్‌ఆర్ అంటే హైదరాబాదు మెట్రో రైల్‌కి చెందిన ఇరవై నాలుగు స్టేషన్లకి పండుగ కళ వచ్చేసింది. రెండువేల సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కి రెండువేల ఆరు సంవత్సరంలో జార్జ్‌బుష్‌గారికి ఎర్రతివాచి పరచిన హైదరాబాదు అప్పుడు ఎంత సందడి చేసిందో ఇప్పుడు నవంబరు చివరి వారంలో అమెరికా అధ్యక్షుని సలహాదారు ట్రంప్‌గారి మొదటి భార్య కుమార్తె - విశ్వ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సభల సంయుక్త నిర్వాహకురాలు అయిన అందాల తరుణీమణి ‘‘ఇవాంకాట్రంప్’’ రాకకి కూడా అంతకు రెట్టింపు హంగామా సందడి చేసింది గవర్నమెంటు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అని నిత్యనూతనంగా హైదరాబాదు సిటీలో స్థానికులకి, వచ్చే చుట్టాలకి కనబడే ముష్టివాళ్ల వింతలు మాత్రం లేవు పాపమొ పుణ్యమొ? వాళ్లని హుష్‌కాకి చేసేశారు! కేసీఆర్ జీఎనియస్‌కి వచ్చిన బ్రహ్మాండమయిన ఐడియా, ఇవాంకా సుందరి గౌరవార్థం ‘్ఫలకనుమా అందాల స్వర్గ-మందిరం-లో-ఈ మహావిశ్వంలోనే అతి పెద్దదయిన భోజనాల బల్ల మీద విందు - అందులో హై బిర్యానీ పసందు సమకూర్చి - సకల జనులను అచ్చెరువు పరచుట ఒక ప్రత్యేక అధ్యాయం. అంతేనా? ఎనభై - కొంతమంది కోటి అని కూడా కోస్తున్నారు లక్షల జనాభా వున్న జంట నగరాలలో ‘కుక్క్భా’ ఐదు లక్షలుంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ సభల ప్రాంతం విందు వినోదాల విడిది ప్రాంతంలో మాత్రం సశునక సందడి లేకుండా చేశారు. ఎలా చేశారో? ఇదే ఫార్ములా ఊరంతా అప్లై చెయ్యకూడదా.. అంటారు కొందరు ఆశాజీవులు - అదిసరే, ఇంత చేసినా ఓ వెర్రిబాగుల కుక్క అతిథుల మధ్యకి తోక ఊపుకుంటూ వచ్చేసింది - చచ్చినంత కల కాశారు దాన్ని అవతలకి ఎత్తుకుపోవడానికి - (బిర్యాని మహిమభాయ్ అన్నాడో కొంటి కోణంగి-) ఆరువందల ఇరవయ్ ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల మహానగరంలో ఇవాంకా తిరుగాడాలని ప్రభుత్వం అనుకున్న ప్రాంతాన్ని రంగు రంగేలీగా ముస్తాబు చేశారు-‘రోడ్లా’? అవి? ‘చెక్కుతద్దాలా’? అన్నట్లు - చేశారు.. 50 కోట్లు రోడ్లమీద ఓ విడతకి పెడితే వారం తిరిగేసరికి హుష్‌కాకి అయిపోయాయి. ఐదువందల కోట్లు మంజూరయిన శిఖరాగ్ర సభల్లో అందం ఇనుమడిమ్చడానికి కారణం పైకమే.
వనితాసాధికారక సమరోత్సాహం. 150 దేశాల నుంచి రెక్కలు కట్టుకుని వాలిన ప్రతినిధులలో యాభై రెండుశాతం భామమణులే. మందీమార్బలంలో కూడా కొప్పులే ఒప్పుల్ కుప్పలు! - అసలు ఈ అంకుర పారిశ్రామిక వేత్తల కోసమే భారత పిఎం నరేంద్రుడు వస్తున్నాడు గనుక, మెట్రోకి కూడా ‘‘సారు’’ చేతనే (కేసీఆర్ కేటీఆర్‌లు భద్రంగా చూస్తూ ఉండగా రిబ్బను కత్తిరించే పని చేయించుకుందామనుకున్నారు. ఏది ఏమైతేనేమి? పోచంపల్లి సిల్కు కాటన్ చీరలు స్టాకులు అన్ని రకాలు ఖాళీ అయ్యాయి. దేశదేశాలలో ఇప్పుడు తాజ్‌మహలు జాగాలో చార్మినారు బొమ్మలు షో కేసులకి ఎక్కాయి. ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ పిచ్చిపిచ్చిగా పెరిగిపోయిన స్మార్ట్‌కాలం గనుక జనాలకి మీడియా పండుగ చేసింది. - మనవాళ్లు 550 మంది ఆడపిల్లల్ని వాలంటీర్లుగా ముస్తాబు చేసి పెట్టారు. హైదరాబాద్ నగరంలో విందు వినోదాలు ఆరగించిన విశ్వ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల మూన్నాళ్ల మురిపాలు ముచ్చట్లు అన్నీ టిఫిన్ సెంటర్లలో మిర్చి బజ్జీ తింటూ సామాన్య జనం చెప్పుకున్నారు. బుల్లితెర మీద అట్టహాసంగా ఇవంకా షో పనిలో పనిగా, తాజా ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ని, టోకుగా తిలకించారు. రవి గాననిచో కవి -ఆ కవికూడా గానని చో -క్లోస్డ్ సర్క్యూట్ కెమెరాలు - గుట్టు రట్టుగా చూపించేస్తాయి. రోజులు మారేయ్ - నిజమే, శ్రీమతి ఇవంక మీద ఈగ, మోదీజీ మీద దోమ వాలకుండా చూడాల్సిందే కాని, అల్లా చూడ్డానికి, అమెరికా నుంచి వందమంది వేగుల వాళ్లు భద్రతా సిబ్బంది నెల రోజులు ముందే దిగబడి - కోవాలు మేవాలు బై ది బై బిర్యాని మేయడం మొదలెట్టారు. ‘‘ప్రెస్’’ని ఎంత ‘ప్రెస్సు చేస్తే’ అంత పంతం పెరుగుతుంది వాళ్లకి. సీసీ కెమేరాలని పోలీసు బాస్ కార్యాలయంలో మోనిటర్ చెయ్యక తప్పదుగా... అక్కడ నుంచి లాగేసి - గుట్టు రాటు చేసేశారు మీడియాసురులు. బ్రేవో! శిఖర సభలలో 150 దేశాల ప్రతినిధుల కలకలం అటు సద్దు మనిగినా - ఇవతల అంతరిక్ష రైలు పండుగ దినదిన ప్రవర్థమానమై పర్యాటక మనోరంజితమై... అవునుమరి!, దేవుడా దేవుడా ఎప్పుడొస్తుంది దేవుడా.. అంతరిక్ష రైలుబండి మన నెత్తిమీద కూతపెట్టి కదుల్తుందా? అంతరిక్ష నిర్ధూమ రైలు ఏడ? పరమ శివుడా, అంటూ జనాలు ఎదురుచూస్తున్న హెచ్‌ఎమ్మార్ అంటే హైదరాబాద్ మెట్రో రైలు కదిలింది. ప్రొటోకాల్ అంటూ అరుస్తున్న పెద్దలందర్నీ వెళ్లిపోయిన స్టేషన్‌ని మరచిపోయినట్లు మరచిపోయి మియాపూర్ నుంచి - జనగణ మానసోల్లాసంగా జేగీయమానంగా కదిలింది నయా రైలు - నగరం పండుగ చేసుకుంది. నిజానికి అమెరికా మంత్రిత్వ శాఖ మహిళల విభాగం, మన నీతి అయోగ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జిఇఎస్ సమారోహానికి మెట్రోకి ఏమీ సంబంధం లేదు - బాదరాయణం అన్నట్లు ‘‘నమోయన సంబంధం’’ మాత్రమే. మళ్లీ ప్రధాని దొరకొద్దా... ఇప్పటికే - రెడీ అయిపోయి తెగ ‘‘డ్రెస్ రిహార్సెల్స్’’ చేసేస్తున్న - గగన శకటం రాదా? గగన పుష్పమా? అని తిడుతున్నారు పురజనులు వారిని చూడ వచ్చిన ఉభయ రాష్ట్ర బంధువులు కూడా- ఉమ్మడి రాజధానిలో కూతపట్టిన ఈ రైలుకి ఖర్చు కిలోమీటరుకు 250 కోట్ల రూప్యములు మాత్రమే అయ్యింది- మియాపూర్ నుంచి నాగోల్‌కి వున్న ముప్పై కిలోమీటర్ల దూరం గగనమార్గంలో ఎగిరే ఈ రైలు ‘అడ్డం’లనుంచి క్రిందకి చూసినా ముచ్చటే - ఆ దృశ్యాల్ని చూసినా ‘‘వవ్’’... క్రింద నడుస్తూ ద్విచక్ర వాహనాల మెడ ఎలాగ్ చూడలేం- ప్రాణాలకు తెగిస్తే తప్ప. అంత ట్రాఫిక్ - సీత నుంచే లంక కాలింది అన్నట్లు ఈ పద్నాలుగువేల కోట్ల రూపాయల ‘‘ఐరావతాన్ని’’ - ప్లాన్ చెయ్యాల్సివచ్చింది. 2004 నాటి ఐడియా, 2012 ఏప్రిల్ 12 నాటికి భూమి పూజకి నోచుకున్నది... ఆనక, కలలు కన్నాము. పీడకలలు తొలిగాయి.
ప్రస్తుతానికి హైదరాబాద్ రోడ్ల మీద 50 లక్షల వ్యక్తిగత వాహనాల వినియోగం ఉంది. ప్రతి రోజూ 80 లక్షల ట్రిప్పుల మేర మోటారు వాహనాల మీద ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ సదుపాయాల ద్వారా జరుగుతున్న రాకపోకలు కేవలం 40 శాతం మాత్రమే కనుక మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎమ్‌ఆర్టీఎస్) మొదటి దశలో మెట్రోకు 72 కి.మీ. దూరం రూపకల్పన చేశారు. ఇందులో 3 ఎక్కువ జనసమ్మర్థమైన ప్రాంతాలను ఎంచుకున్నారు. చివరికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. మూడు కారిడార్‌లు - 1 (మియాపూర్-ఎల్‌బి నగర్)ను ‘ఏ’ అన్నారు. కారిడార్-2 (జెబిఎస్-ఎంజిబిఎస్) ‘బీ’, కారిడార్ -3 నాగోల్-హైటెక్ సిటీ) రూటూ ‘సి’ అన్నారు. ఇప్పటికి, ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు అన్నట్లు - మెట్రో కల నిజమయింది. మొత్తం ఏరియాలో పదిహేను శాతం రోడ్లు వుంటే తప్ప చాలని మహానగరంలో పదిశాతం రోడ్ల్లు మాత్రమే వాహనయోగ్యమైనవి ఉన్నాయి. నాలుగువేల బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఆటోగతప్రాణులైపోయారు విద్యార్థులు, ఉద్యోగులు. అద్సరే, ప్రస్తుతానికి, ఇంటికొచ్చిన చుట్టాలు పక్కాలు - మెట్రోని వాళ్ల లిస్టులో ముందు ఎట్టేసుకుని - అత్తారింటికి దారేది? అన్నట్లు - మెట్రో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. చూతమూ మెట్రో వింతలూ - అంటూ... ‘‘కానీ అంతా మయసభ అనుకో - ఇలా చూస్తో వుంటే అలా స్టేషను వచ్చింది’’.. ‘‘మెట్లు తిరపతే.. ఎస్కలేటర్లు అవో మాయా సోపానాలు’’ అంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ - మీ పిల్లల్ని అల్పాచమానం గట్రా ఇంటిదగ్గరే చేయించి తీసుకుపొండి - ఆనక ఇజ్జతఘర్‌లు వెతుక్కుంటూ పోవాలంటే భయం వేస్తుంది - అని హెచ్చరిక ఇరవై సెకన్లు ‘‘ఆగుద్ది’’ పైగా ఆడపిల్లలే తోల్తున్నారంట - అంటూ మొదటి రోజు లక్ష మంది ఎక్కి తిరిగి వచ్చి టిఫిన్ సెంటర్ల మీద పడి పండుగ చేసుకుంటే - మర్నాడు లక్షన్నర మంది -
కానీ మీరుండే పేటకి దగ్గర స్కూటరు, కారు వేసుకుపోయారో - మళ్లీ మీరు జాయ్‌రైడ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి మీ బండ్లు పోలీసులు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఇరవయ్ నాలుగు స్టేషన్లకి పనె్నండు చోట్ల - ఏ స్టేషన్‌కి అందాక వెళ్లే బస్సులు - గిస్సులు లేవు. ‘్ఫ్లతోర్మ్స్’ మీద నో డస్ట్ బిన్లు. మోదీ గారికి ‘కోపంక్’ వస్తుంది - ఏదైనా క్రింద పడేస్తే అన్నాడో కళాశాల భామ. బెజావాడ, గుంటూరు నుంచి కూడా అన్నట్లు తెనాలి నుంచి కూడా మనవాళ్లు - కొంచెం బాధగా మొహం పెట్టుకొని వస్తున్నారు. పనిలోపనిగా మెట్రో చూసేద్దామని. - ఉమ్మడి రాజధాని- అన్నారు గదా... మా చుట్టాలు అంతా ఉమ్మడి పౌరులు గనుక మేము కూడా అందరు పౌరులతో హ్యాప్పీ అన్నారు కొందరు మెట్రో విజిట్ చేసుకొని వచ్చి - మాకు తెల్లారిలేస్తే వస్తాం - మాకు ఖమ్మం, వరంగల్ లాంటి ఊళ్లకి పోయినా - వేరు అన్న ఫీలింగు రాదు - అన్నాడో ఆంధ్రా ఫ్రెండు - ఇంతెకీ రియల్ ఎస్టేటు తేజీ అవుతూందా? అని అడిగాడు -రాజమండ్రి బిల్డర్ బాబాయ్. తెల్దు - వెనుకటికి - జట్కాలు వచ్చి ఎడ్లబండ్ల పొట్టకొట్టే - బస్సులొచ్చి బండ్లవాల్ల పొట్టకొట్టే -- ఆటోలొచ్చి రిక్షావాల్ల కూడు కొట్టే - ఆనక టాక్సీలొచ్చి ఆటోల తోక కత్తిరించే అని పాటలు పాడేవాళ్లు - ఇప్పుడు రోజుకో రెండుమూడు లక్షల మంది ‘‘ఆటో ఆటో వస్తావా అన్నా’’ అని ... - అడగరు -సాఫ్ట్వేర్ కంపనీలు స్మార్ట్‌కార్డులు సిబ్బందికి కొనిచ్చేస్తే? అమ్మో!
మెట్రో స్టేషన్లకి - మినీ బస్సులు వెయ్యాలి - షేరు ఆటోలు షేరు టాక్సీలు వుండాలి అంటున్నారు తెల్లారగట్ల లేచి పొట్ట చేతబట్టుకుని - ఎచటికిపోతావంటే? ఊరవతలకి అనే లక్షలాది యువజనులు. వీళ్లంతా స్మార్ట్‌కార్డులు అంటే సీజన్ టిక్కెట్లు కోసేస్తారేమో?.. కల నిజమాయెగా.. కోరిక తీరగా... గగనయనమూ హాయిహాయిగా..
సింగ్ ఎ సాంగ్ అండ్ లివ్ లాంగ్!