వినమరుగైన

శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1930 ఆగస్టులో ఆరోగ్య ప్రకాశికలోని మద్య నిషేధాన్ని ప్రస్తావిస్తూ పలుకులను ఇలా ఉటంకిస్తారు.
ప్రపంచమున మనుష్యులను జంపుటలో అనగా హత్యానేరము చేయుటలో నన్ను మించినవారు మరెవ్వరు లేరు.
ప్రపంచమున నిదివరకు జరిగిన యుద్ధములన్నిటిలోను చంపబడినవారి మొత్తము సంఖ్య కంటే నాచే జంపబడినవారి సంఖ్యయే మిక్కిలి హెచ్చుగా నుండును.
నేను మనుష్యులను పశువుల క్రింద మార్చితిని. నేను కోట్ల కొలది కుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునట్లు చేసితిని.
కోట్లకొలది మనుష్యులను అధోగతికి కొనిపోవునట్టిదారిని సరిచేయుచుందును. నేను బలహీనులుగా చేయుదును. బలహీనుల నంతమొందించెదను.
నేనిదివరకు ఎన్ని కోట్లమందినో పాడుచేసితిని. ఇంకను ఎన్ని కోట్లమందినో పాడుచేయుటకు ప్రయత్నించెదను. నా పేరే సారా దేవత.
శీతాకాలంలో ప్రొద్దుకు ముద్దకూ సరియట. లలిత కళలలో ప్రథమ పాఠములు బాలికలు గొబ్బి పండుగలో నేర్చుకుంటారట. సంక్రాంతివేళ గృహాలంకరణ గురించి ప్రాతగోడకు పూత చక్కనా, కోతిరూపికి వ్రాతచక్కనా అని చెపుతూ అపుడు వేసిన ఆవుపేడ కస్తూరికి తుల్యమనే ఆయుర్వేద రహస్యాన్ని గుర్తుచేస్తారు.
విదుషీమణి పూర్ణమ్మ స్వాములవారితో మాయమయ్యింది.
దొంగ సాధుల కౌటిల్యాన్ని, భోగలాలసతను గురించి జూలై 31లో రాశారు. ఎట్టి పాండిత్యము, ఎట్టి మనీష- శీలముతో సరిగావు. యోగ్యత మనుష్యులకు వజ్రాంగిజోడు, వినీత వర్తనమునకు గౌరవమున్నది. ఎట్టి పరిస్థితుల్లో వక్రత లేని నైతిక జీవితం గడపనేర్పిన వారే ధన్యులని కీర్తిస్తారు.
జనవరి 32 జాబులో సర్వ విషయములందు అవిప్త బుద్ధితో వర్ణిచమంటే విముఖులై- మూఢులు కమ్మని, కాదని వివరిస్తూ మంత్రసాని విద్యనుండి మాలలు కట్టే పనివరకు స్ర్తిలు ఎన్ని చేయవచ్చునో విపులంగా సూచిస్తారు.
పుష్కరాలను గురించి చెప్తూ-
మూడు దినములకంటే నధికముగా నుండకుండుట, పచ్చిపండ్లు, నిలువపండ్లు తినకుండుట, పుణ్యమను భ్రాంతితో గోదావరిలో పచ్చినీరు త్రాగకుండుట ముఖ్యమని 32 జూలై జాబులో హెచ్చరిస్తారు.
పచ్చని పసిడి నమ్మి నీవు తీసుకొనునదేమి- కాగితములు, కరెన్సీ నోట్లు
ఆ కాగితము వలన నీవువ్రాయించుకొనునదేమి- కాగితము ప్రామిసరీ నోటు
ఆ కాగితమువలన నీకు వృద్ధి పొందునదేమి కాగితములుఆ కాగితములధికమైనచో వారు నీకిచ్చునదేమి కాగితము (ఐ.పి)
వడ్డీ ఆశ మొదలు చెరుచుతుందనీ, నగలమ్మ వద్దని హితవు మరొక జాబులో-
అడవిలో సీతమ్మ నగల మూట విడిచి జాడ తెలియజేయగలిగిందని - స్ర్తికి నగలు పలు విధములుగా అక్కరకు వస్తాయని చెడగొట్టి రొఖముగా మార్చవద్దని శారద కల్పలతను వారిస్తుంది. కొమ్మన రాధాకృష్ణారావు

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది