రాష్ట్రీయం

భద్రాచలంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20న తెప్పోత్సవం... 21న ఉత్తరద్వార దర్శనం
భద్రాచలం, డిసెంబర్ 10: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభవుతున్నాయి. ముందుగా పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి స్వామి వరుసగా భక్తులకు దశావతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. 20వ తేదీ సాయంత్రం గోదావరిలో హంసాకృత తెప్పపై శ్రీ సీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 21 ఉదయం స్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. 21 రాత్రి నుంచి స్వామికి రాపత్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏఎస్పీ కార్యాలయం, అంబాసత్రం, శ్రీకృష్ణ దేవాలయం, శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, తాతగారి గుడి గోవిందరాజస్వామి ఆలయం, పురుషోత్తపట్నం, పునర్వసు మండపం, విశ్రాంతి మండపం, దసరా మండపం, శ్రీరామదాసు మండపాల్లో రాపత్ ఉత్సవాలు జరుగుతాయి. 2016 జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు స్వామికి విలాసోత్సవాలు, జనవరి 6న విశ్వరూప సేవ ఉంటాయని స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథాచార్యులు తెలిపారు. నేటి నుంచి స్వామివారికి నిత్య కల్యాణాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.