ఉత్తరాయణం

మోడల్ పేపర్లను విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్‌లు జారీ చేస్తుంది. అలా జారీ చేయడంతోపాటు, ప్రశ్నల నిధి, మోడల్ పేపర్లు, మాదరి ప్రశ్నా పత్రాలను కూడా విడుదల చేయవలసినదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు మనవి చేస్తున్నాం.
- కె. వెంకటేశ్వర్లు, కరీంనగర్
బాధ నుంచి దేశభక్తి పుట్టాలి
అమీర్ ఖాన్ హీరో స్థాయ నుంచి ఈడియట్ స్థాయకి దిగజారిపోతే అతనిని సమర్ధించడానికి కేజ్రీవాల్, లల్లూ, ములాయం లాంటి వాళ్లు క్యూ కట్టారు. అంటే టిప్పు సుల్తాన్ ఒప్పుకున్నట్లే కదా. దేశాన్ని అవమానించడానికి పుట్టనించి చీమలు బయటకు వస్తున్నాయ. రహమా నులు, ఖాన్‌లు పుట్టుకొచ్చారు. భారతదేశాన్ని అవమాని స్తుంటే, మమ్మల్ని కాదు అని యువత నిద్ర పోతే, ఇంకా ఎంతోమంది టిప్పు సుల్తాన్‌లు పుట్టుకొస్తారు. దొంగలు- దొంగలు వూళ్లు పంచుకున్నట్టు దేశద్రోహులు ఈ దేశాన్ని దోచుకొని పరిపాలిస్తారు. కుహనా నాయకుల మాటల గారడికి మోసపోతున్నారు. మణిశంకర్ లాంటి ఫకీరులు పాకిస్తాన్‌కు వెళ్లి దేశ ప్రధానిని అవమానిస్తున్నారు. ఎంత మంది దేశ యువత స్పందించారు? చరిత్రను చదవడం లేదు. వినడంలేదు. తెలుసుకోవాలన్న ఆలోచన లేకపోతే ఎలా? జాతీయత మంటకలిసిపోతున్నది. అన్నా హజారే యేమయ్యాడు? దేశభక్తి ఏమయ్యంది? సంవత్సరానికి లేచి ఏదో ఒక మాట అని స్తబ్దుగా మారిపోవడమేనా? దే శాన్ని అవమానిస్తుంటే నిద్దురెలా వస్తున్నది? ఒట్టిమాట లు కట్టిపెట్టి దేశమేలు తలపెట్టవోయ్. మాయ మాటలకు మోసపోకూడదు. బాధ నుంచి దేశభక్తి పుట్టా లి.
- జి. జగదీశ్వర్, నల్లకుంట, హైదరాబాద్
సహనాన్ని బలహీనతగా భావించవద్దు
ఆవుమాంసం తింటాం. యేమి చేస్తారో చూస్తాం అని హిందువుల మనోభావాలను గాయపరచే విధంగా, రెచ్చ గొట్టే విధంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితర ప్రముఖులు వాఖ్యలు చేయడం ఖండనార్హం. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో హిందువుల ఆరాధ్య దైవాలను కించపరిచే విధంగా చేస్తున్నా సహిస్తున్నకొద్దీ రెచ్చిపోతున్నారు. హిందువుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా?
- వేదుల జనార్ధనరావు, వంకాయలవారి గూడెం
‘బీఫ్ ఫెస్టివల్’ అవసరమా?
ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబరు 10న ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయ. ఇది చాలా వ్యతిరేకించాల్సిన విషయం. ఆరోజు బీఫ్ ఫెస్టివల్, మరో రోజు హ్యూమన్ ఫెస్టివల్ జరిపినా ఆశ్చర్యం లేదు. మన నాగరికత ఎటు పోతున్నదీ అర్థం కావడం లేదు. ఎవరినో సాధించాలన్న ఉద్దేశంతో చేపట్టే ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల సానుకూల మీడియాలో ప్రచారం బాగా రావచ్చేమో కానీ, అది నిర్వహించాల్సినంత అవసర కార్యమేం కాదు. ఆకలి తీర్చుకోవడానికి జంతువలపై ఆధారపడటం వేరు, కేవలం కసికొద్దీ, ఎవరినో సంతుష్ట పరచాలన్న ఉద్దేశంతో చేపట్టడం వేరు. అనవసర రాద్ధాంతాల వల్ల ఒరిగేదేమీ లేదు. అమాయక ప్రాణులు పోవడం తప్ప.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
అంతా చదివి తీరాల్సిన వ్యాసం
ఎమ్.వి.ఆర్. శాస్ర్తిగారు అజ్మేర్ ఆర్యసమాజ్ పరోపరకారిణి సభ వార్షిక ఋషిమేళాలో చేసిన ప్రసం గాన్ని ఈమధ్య ఆంధ్రభూమిలో ప్రచురించారు. దీన్ని హిందువులు, హిందువేతరులు కూడా తప్పక చదివి తీరాలి. గోవులు, వేదాల్ని పరిరక్షించిన దేశానికి ఎప్పటికి రక్షణ ఉంటుంది? హిందువులు ఏ పూజను ఏ దేముడికి చేసినా చివర్లో ‘‘సర్వేజనా సుఖినోభవన్తు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవన్తు’’ అని ముగిస్తారు. ఇది వేదోక్తి. ఈ ఆశీర్వచనం అన్ని మతాలవారికి వర్తిస్తుంది. అసలు ప్రపంచానికి సంస్కృతిని నేర్పింది భారతదేశమని గత చరిత్ర చాటుతోంది. అటువంటి ఉన్నత శిఖరాగ్రాన ఉన్న దేశం ఈనాడు సంకుచిత స్వభావాలతో, స్వార్థపూరిత జీవన విధానాలతో, సంస్కృతి-సంప్రదాయాలను దిగజా ర్చి, పరుల ఎదుట చులకన అయపోతున్నది. ఆడవారి కట్టుబొట్టులో మార్పులు వచ్చాయ. జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు. శాస్ర్తిగారు చివర్లో చెప్పినట్టు వేద వేదాం గాల వైశిష్ఠ్యం, గర్వించదగ్గ ఆర్య వారసత్వం, ఈ కాలపు వారికి తెలియక పోయాయ. దీనికి కారణం ఒక్కటే గోచరిస్తున్నది. పెద్దవాళ్లు నిష్ఠగా ఏది ఆచరిస్తే చిన్నవాళ్ల కది అనుసరణీయం కాగలదు. గీతోపదేశం కూడా ఇదే కదా!
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
పెరుగుతున్న చైన్ స్నాచింగ్‌లు
రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగిన నాటి నుంచి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఛైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయ. మహిళలు కనిపిస్తే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో ఆభరణాలు ధరించి స్ర్తీలు పట్టపగలు కూడా బయటకు రావడానికి జంకు తున్నారు. రద్దీగా ఉంటే బస్టాండు, రైల్వే స్టేషను, మార్కెట్ కూడళ్లు, దేవాలయాలు, ఇలా అన్ని ప్రదేశాలలో దొంగలు విజృంభిస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి, మండలాలలో భూ సమీకరణ చేపట్టినప్పటినుంచి విజయవ డ, గుంటూ రు ప్రాంతాల్లో విఐపిల పర్యటనలు అధికమవడంతో వారికి కల్పించాల్సిన పోలీసు బందోబస్తుపై దృష్టి కేంద్రీకరించడం చోరులకు కలిసివచ్చింది.