రాష్ట్రీయం

సిఎం వ్యాఖ్యలకు యుటిఎఫ్ ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరని, పేద పిల్లలకే ప్రభుత్వ పాఠశాలలా అంటూ సిఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఎపి యునైటెడ్ టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. మంత్రులు, రాజకీయనాయకులు, అధికారులు, ఆదాయ వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేరడం లేదో సమాధానం చెప్పాలని ఎపి యుటిఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా పాఠశాలలను అభివృద్ధి చేయాలని, అందుకు కామన్ స్కూల్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.