తెలంగాణ

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, ఏప్రిల్ 25: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన ఒక యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. రామడుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఏగుర్ల వినోద్ (30) గత కొంతకాలంగా గంగాధర మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువతి (18) అనే యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోన్‌లో వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులతో పాటు మండలంలోని బొమ్మారెడ్డిపల్లికి చెందిన యువతి తాత ఒరుగల ఎల్లయ్యతో కలిసి శనివారం ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలను పిలిపించిన ఎస్‌ఐ ఇకపై ఒకరి జోలికి ఒకరు వెళ్లవద్దంటూ చెప్పి పంపించినట్లు తెలిపారు. బొమ్మారెడ్డిపల్లిలో రెండు నెలల నుండి పాత ఎల్లయ్య ఇంటిలో యువతి ఉంటోంది. సోమవారం వినోద్ యధావిధిగా యువతి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించడమే కాకుండా ఫోన్‌లు చేయడంతో మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్తామని యువతితో పాటు తల్లిదండ్రులు, తాత బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన వినోద్ పోలీస్ స్టేషన్ ఎదుట క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన పోలీసులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుని తల్లిదండ్రులు తన కొడుకును యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు గుంట గంగమ్మ, గుంట రాజయ్యలతో పాటు తాత ఒరుగల ఎల్లయ్య, ఒరుగల రాజమ్మ, ఒరుగల అంజలి, ఏగుర్ల మల్లయ్య, ఏగుర్ల కొమురమ్మలు చేయి చేసుకొని బెదిరించడంతో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.