తెలంగాణ

ఖమ్మం ప్లీనరీకి ఇసి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఖమ్మంలో ఈ నెల 27న నిర్వహించనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ప్లీనరీని నిర్వహించుకోవచ్చని టిఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అధికారికంగా తెలియజేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాకి జరుగనున్న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తాము నోటిఫికేషన్‌కు ముందుగా నిర్ణయించుకున్న మేరకు ప్లీనరీకి అనుమతించాలని టిఆర్‌ఎస్ పార్టీ తరఫున మంత్రి కెటిఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉండటంతో ప్లీనరీ ఖర్చును పార్టీ ఖర్చుగానే పరిగణించనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అధికార యంత్రాంగాన్ని ప్లీనరీలో ఉపయోగించుకోరాదని, మంత్రులు, ముఖ్యమంత్రి ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉండటంతో ఖమ్మం జిల్లాల్లో అధికారిక పర్యటనలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.