తెలంగాణ

వడదెబ్బకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్/చండ్రుగొండ, ఏప్రిల్ 2: ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. కొత్తగూడెం ఏరియాలో శనివారం ఒక్క రోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామానికి చెందిన వీరయ్య (65) శుక్రవారం ఉదయం చేను పనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి దాటిన తరువాత పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కొత్తగూడెం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరయ్యకు భార్య వీరమ్మ, ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా కొత్తగూడెం రూరల్ మండల పరిధిలోని సింగభూపాలెం శివారు పాత అంజనాపురం గ్రామానికి చెందిన ఐతం రంగారెడ్డి (60) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.