తెలంగాణ

మూడు వారాల్లోగా జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్‌ను మూడు వారాల్లోగా పునరుద్దరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజలు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించేందుకు వీలుగా అన్ని విధాల పొందుపరుస్తామని వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది నజీబ్ ఖాన్ వివరణ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ జీవోల వెబ్‌సైట్ నిలుపుదలను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది వివరణ అనంతరం ఈ కేసును ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.