తెలంగాణ

నేటి రాజకీయాల్లో కాంట్రాక్టర్లు, ధనవంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: నేటి వర్తమాన రాజకీయాల్లో కాంట్రాక్టర్లు, ధనవంతులే రాజకీయాల్లో రాణిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో 71వ గణతంత్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు ధనప్రవాహం కన్పించలేదన్నారు. రాబోవురోజుల్లో విద్యావంతులు, మేధావులు, సంఘ సంస్కర్తలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో అన్ని వర్గాల్లో ఉన్న యువకులను ప్రోత్సహించండంతో సకలజనులకు చెందిన వ్యక్తులు రాజకీయ రంగంలోకి వచ్చారన్నారు. అందులో భాగంగానే తాను కూడా రాజకీయ రంగంలోకి వచ్చానన్నారు. ప్రస్తుత రాజకీయాల చుట్టూ ధనం మాత్రమే కన్పిస్తోందన్నారు. నేడు రాజకీయ వేదికలపై మాట్లాడడానికి వెనుకబడిన వర్గాల వారికి అవకాశం వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.