తెలంగాణ
మిషన్ భగీరథకు రూ. 1530 కోట్లు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 January 2020
హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సురక్షిత మంచినీటిని అందించడానికి ఉద్దేశించిన మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ. 1530 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో 11 నియోజకవర్గాల్లో ఉన్న 107 మండలాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించడానికి చేపట్టిన పనుల కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల కోసం ఇప్పటికే రూ. 5536 కోట్లతో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. జరుగుతున్న పనుల కోసం 1530 కోట్లు అదనంగా విడుదల చేశారు. పైపులైన్లు, రిజర్వాయర్లతో పాటు మల్లన్నసాగర్ పనుల కోసం ఖర్చు చేస్తారు.