తెలంగాణ

వానలతో వచ్చిన ఈశాన్య రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ నుండే కాకుండా దేశం నుండి బుధవారం వెళ్లిపోయిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గురువారం తెలంగాణలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వానలు కురిశాయి. అలుబాక (ములుగు) లో 6.3 సెంటీమీటర్లు, ఎల్కపల్లి (కొమురం బీం) లో 6 సెంటీమీటర్లు, మంథని ముత్తారం (పెద్దపల్లి) 5.8, మర్రిపల్లిగూడెం (వరంగల్-పట్టణ) 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, సిర్సిల్లా, కామారెడ్డి, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వానలు కురిశాయి. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 33.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.