తెలంగాణ

అంకితభావంతో పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేయాలని కొత్త ఐఏఎస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కోరారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఆపిల్ మ్యాక్‌బుక్, ఐఫోన్, ఐప్యాడ్‌లను సోమవారం ఆయన బహూకరించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో సాంకేతిక విజ్ఞానాన్నివినియోగించుకోవాలని,
కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలని కోరారు. గ్రామాల్లో అమలవుతున్న 30 రోజుల ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల విస్తృతమైన అవగాహన కల్పించుకోవాలని జఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ చిట్టిరాణి కూడా పాల్గొన్నారు.

*చిత్రం...కొత్త ఐఏఎస్ అధికారులకు ఐఫోన్ తదితర పరికరాలను అందిస్తున్న సీఎస్ జోషి