తెలంగాణ
గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 19: గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ను ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. పీఆర్ చట్టంలోని 141 సెక్షన్ ప్రకారం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రిబ్యునల్కు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే ఈ ట్రిబ్యునల్ విచారిస్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుపై ఇతర కోర్టుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. అంటే ఇతర కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీలులేదు. కేవలం ప్రభుత్వానికి మాత్రమే అప్పీల్ చేసుకోవచ్చని చట్టంలో పొందుపరిచారు.