తెలంగాణ
హెల్త్ ఎమర్జెన్సీగా డెంగ్యూను ప్రకటించాలి: బీజేపీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంటే హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీజేపీ నేత కరుణా గోపాల్ విమర్శించారు. ప్రతి ఇంటిలో విష జ్వర బాధితులు ఉన్నారన్నారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని ఆమె అన్నారు. హైదరాబాద్ గ్లోబల్ నగరంగా ప్రచారం చేస్తున్నారని, కాని పరిపాలన మాత్రం అధ్వాన్నంగా ఉందన్నారు. విష జ్వరాలకు దోమ లార్వాలను లార్విసిడల్ అనే శుద్ధి కార్యక్రమంతో గుంతలను పూడ్చి వేయాలన్నారు. రోడ్లపై వరద నీరు పారకూడదని, నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరైన రీతిలో ఉండాలన్నారు.