తెలంగాణ

ఆరేళ్లలో 42 వేల జీవోలను దాచిపెట్టిన టీఆర్‌ఎస్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో విడుదలైన 42వేల జీవోలను ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం దాచిపెట్టి ఉంచిందని, ఈవిషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు బీజేపీ నేత పేరాల శేఖర్ రావు చెప్పారు. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ప్రజలకు అన్ని జీవోలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం పేర్కొన్నదన్నారు. పారదర్శక పాలన అంటూనే సమాచారంపై గోప్యత ఎందుకన్నారు. కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయల పనులకు విడుదల చేసిన జీవోలు మాయమయ్యాయన్నారు. మిషన్ భగీరథ 450 గ్రామాలకు మంచి నీరు అందిస్తామని ఖర్చు చేసిన రూ.1260 కోట్లు ఖర్చుపెట్టిన జీవోలు అడిగినా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. దాదాపు 35 శాతం జీవోలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదన్నారు.